Meerpet Crime: పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక విద్యార్థిని ఏం చేసిందో తెలుసా?

Read Time:  1 min
Meerpet Crime: పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక విద్యార్థిని  ఏం చేసిందో తెలుసా?
FONT SIZE
GET APP

Meerpet Crime: పెంపుడు జంతువులను కేవలం జంతువులుగా కాకుండా, కుటుంబ సభ్యుల్లా చూసుకునే ఈ రోజుల్లో.. ఒక పిల్లి మరణం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read Also: Telangana Rising Vision 2047: బడ్జెట్ సిద్ధం.. యంగ్ ఇండియా కిట్స్ సహా ఆరు కొత్త పథకాలు!

అసలేం జరిగింది?

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ వెంకటాద్రి నివాస్‌లో హిమబిందు అనే 20 ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమె ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. అయితే గత 2 ఏళ్లుగా హిమబిందు తన ఇంట్లో ఒక పిల్లిని పెంచుకుంటోంది. చాలా ఇష్టంగా, ప్రేమగా ఆ పిల్లిని హిమబిందు చూసుకునేది. దీంతో వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవలె ఆ పెంపుడు పిల్లి చనిపోయింది. ఆ పిల్లి మృతి చెందడాన్ని తట్టుకోలేని హిమబిందు.. ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Meerpet Crime: Do you know what the student did after she couldn't bear the death of her pet cat?
Meerpet Crime: Do you know what the student did after she couldn’t bear the death of her pet cat?

ఆసుపత్రిలో మృతి

అయితే అది గమనించిన హిమబిందు కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే హిమబిందును పరిశీలించిన డాక్టర్లు.. ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం కాస్తా మీర్‌పేట్ పోలీసులకు తెలియడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హిమబిందు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.చిన్న చిన్న కారణాలకే యువత ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.