📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Medchal Crime: దర్శనానికి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Author Icon By Rajitha
Updated: October 23, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Medchal Crime: మేడ్చల్‌ జిల్లా కీసరలో భార్య ప్రణాళికతో జరిగిన భర్త హత్య ఘటన కలకలం రేపుతోంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ ఇల్లాలు తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య (Murder) చేసింది. పోలీసుల వివరాల ప్రకారం కీసర ప్రాంతానికి చెందిన నవనీత అనే మహిళకు 2012లో ఆమె మేనబావ నరేష్‌తో వివాహం జరిగింది. దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో నవనీత ఒక కాంట్రాక్టర్‌ అయిన ఆంజనేయులుతో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధంగా మారింది. ఇటీవల భర్త నరేష్‌కు వారి వ్యవహారం పట్ల అనుమానం రావడంతో ఇంట్లో తరచూ వాగ్వాదాలు జరిగేవి. దీంతో భర్తను మార్గం నుండి తొలగించాలని నవనీత తన ప్రియుడు ఆంజనేయులుతో ప్లాన్ వేసింది.

Read also: Madanpura: మదన్‌పుర భవనం కుప్పకూలింది

Medchal Crime: దర్శనానికి తీసుకెళ్లి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

అక్టోబర్‌ 15న దైవ దర్శనం కోసం పెద్దగుట్ట వెళ్లదాం అని నరేష్‌ను ఒప్పించింది. ముగ్గురూ బైక్‌పై వెళ్లి తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలోని రోడ్డు పక్కన ఆగారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం నరేష్ మత్తులో కుప్పకూలగా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న నవనీత, ఆంజనేయులు అతడిని కర్రలతో దాడి చేసి హత్య చేశారు. తరువాత ఎవరూ గుర్తుపట్టకూడదని మృతదేహంపై పెట్రోల్‌ పోసి కాల్చేశారు. కొన్ని గంటల తర్వాత కాలిన మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులిద్దరినీ గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా చేధించిన సీఐ సంతోష్‌కుమార్‌ సిబ్బందిని ఎస్పీ రాజేష్‌ చంద్ర ప్రశంసించారు.

ఘటన ఎక్కడ జరిగింది?
మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

హత్యకు ప్రధాన కారణం ఏమిటి?
భార్యకు ప్రియుడితో ఉన్న అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Keasara crime latest news Medchal murder Telugu News wife kills husband

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.