అత్త తిట్టడం తో అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి లో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది ఉమామహేశ్వర్ (26) బాచారం గ్రామానికి చెందిన కరోల్ల దీపిక ను బలవంతం చేయడంతో గతం లో మృతుడి పై ఫోక్స్ కేసు నమోదు కావడంతో ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరి దీపికను వివాహం చేశారు. దీంతో ఇరువు దాంపత్య జీవితం సాగించేందుకు జీవనోపాధి కోసం ఇరువురిని భాగ్యనగరం లో పనిచేస్తున్న క్రమంలో ఇరువురికి తరచూ గొడవలు చోటు చేసుకోవడం తో తిరిగి గ్రామానికి రావాలని ఇక్కడే పని చేసుకొని జీవనం సాగించాలని కుటుంబీకులు తెలిపడంతో కొన్ని రోజుల క్రితం వచ్చి మెదక్ పట్టణంలో ఓ వ్యాపార కొట్టులో పని చేస్తుండగా బార్య తరచూ గొడవ పడేదీ.
Read also: Vemulawada:నిర్మాణంలోనే కుంగిన డబుల్ బెడ్రూం తప్పిన ప్రమాదం
Son-in-law commits suicide after being scolded by his aunt!
మాటలతో తిట్టడంతో మనోవేదన కు గురైన
అంతే కాకుండా తన తల్లికి లేని పోనీ మాటలు చెప్పడం తో మృతుడి భార్య తల్లి వచ్చి అల్లుడిని తీవ్ర ఆగ్రహం తో అనరాని మాటలతో తిట్టడంతో మనోవేదన కు గురైన ఉమామహేశ్వర్ ఆదివారం ఇంటినుండి వెళుతూ తనే లేకపోతే ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవని బయటకు వెళ్లడంతో కుటుంబీకులు, తోటి మిత్రులు అర్ధరాత్రి వరకు ఆచూకీ కోసం వెతుకు లాటిన ఆచూకీ లభ్యం కాకపోగా ఉదయం ప్రభుత్వ పాఠశాల పని దినం కావటంతో స్టావెంజర్ పాఠశాల ను శుభ్రం చేస్తున్న క్రమంలో మరుగు దొడ్డి ప్రక్కన గల చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి నీ గుర్తించిన వారు వెంటనే గ్రామస్థులకు తెలియడంతో ఈ విషయం పాపన్న పేట పోలీసులకు సమాచారం చేరవేసి పరిశీలించగా మృతుడు ఉమామహేశ్వర్ కావడంతో మృతుడి కుటుంబీకులు వెంటనే పాపన్న పేట పోలీసులకు పిర్యాదు చేయడంతో పాపన్న పేట పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: