సమాజంలో పెరుగుతున్న కొన్ని దారుణ సంఘటనలు మానవత్వాన్ని మర్చిపోయేలాగా ఉంటున్నాయి.వివాహేతర సంబంధాలు (Extramarital affairs) మనుషులను రాక్షసులుగా మారుస్తున్నాయి. కన్నవాళ్ళను, కన్న పిల్లలను కూడా చంపుతున్నాయి. ఆత్మీయ బంధాలు, రక్త సంబంధాలు కూడా ఇలాంటి సంఘటనల్లో విలువ కోల్పోతున్నాయి.మెదక్ జిల్లా (Medak District) శివ్వంపేట మండలంలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. ఒక తల్లి తన రెండేళ్ల పసిపాప ప్రాణాన్ని క్రూరంగా హరించిన ఘటన స్థానికులను కలచివేసింది.
భర్తతో గొడవపడి మమత పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఫయాజ్తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమ అక్రమ సంబంధానికి ( illicit relationship) పాప అడ్డుగా ఉందని భావించి, ఇద్దరూ కలిసి చిన్నారి గొంతు నులిమి చంపేశారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా గ్రామ శివారులోని వాగు దగ్గర పాప మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
విచారణలో మమత అసలు నిజం బయటపెట్టింది
ఈ క్రమంలో ప్రియుడితో కలిసి వేరే చోటుకి మకాం మార్చింది. అయితే పాప, భార్య కనిపించకపోవడంతో మమత (Mamatha) భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మమత ఆమె ప్రియుడు ఫయాజ్ను గుంటూరులో పట్టుకున్నారు. పోలీసులు విచారణలో మమత అసలు నిజం బయటపెట్టింది. అక్రమ సంబంధం కోసమే కూతురిని చంపినట్లు ఆమె ఒప్పుకుంది.
మమత ఇచ్చిన సమాచారం ఆధారంగా, పోలీసులు ఇద్దరినీ సంఘటనా స్థలానికి తీసుకువచ్చి, జేసీబీతో తవ్వకాలు జరిపి పాప మృతదేహాన్ని వెలికితీశారు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. తల్లి మమతను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కన్న కూతురిని చంపుకోవడానికి కూడా వెనుకాడని మమత చర్య అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read hindi news: epaper.vaartha.com
Read Also: