हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Mary Kom: మేరీ కోమ్ ఇంట్లో భారీ దొంగతనం

Anusha
Latest News: Mary Kom: మేరీ కోమ్ ఇంట్లో భారీ దొంగతనం

భారత బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లుగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ ఇంట్లో జరిగిన దొంగతనం వార్తా ప్రపంచంలో సంచలనంగా మారింది. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 46లో ఆమె నివాసంలో ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. మేరీ కోమ్ (Mary Kom) మేఘాలయలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో, ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దొంగలు ఆమె విలువైన వస్తువులను దోచుకు వెళ్లారు. ఈ దోపిడిలో లక్షల రూపాయల విలువైన వస్తువులు అపహరించబడ్డాయి.

USA: అమెరికాలో కాల్పులు ..ముగ్గురి మృతి

మేరీ కోమ్ తన రెండంతస్తుల బంగళాకు కొన్ని రోజులుగా తాళం వేసి మేఘాలయ (Meghalaya) లోని సోహ్రాలో జరుగుతున్న మారథాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులతో పాటు ఓ టెలివిజన్‌ను కూడా ఎత్తుకెళ్లారు.

Mary Kom
Mary Kom

దొంగలు ఇంట్లో నుంచి వస్తువులను బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో (CCTV cameras) రికార్డయ్యాయి.పొరుగువారు ఈ విషయాన్ని గమనించి మేరీ కోమ్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ, “నాకు చాలా భయంగా, ఆందోళనగా ఉంది. ఈ చోరీ ఈ వారం మొదట్లోనే జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ

24న ఈ ఘటన జరిగిందని పొరుగువారు చెప్పారు. నేను ఇంటికి తిరిగి వెళ్లాకే నష్టం ఎంత జరిగిందో కచ్చితంగా చెప్పగలను. సీసీటీవీ ఫుటేజీలో దొంగలు టీవీ, ఇతర వస్తువులు తీసుకెళ్లడం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చాను” అని తెలిపారు.ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఫరీదాబాద్ పోలీసులు (Faridabad Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870