గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నఓ ప్రేమజంట(love-couple) తమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని దారుణమైన నిర్ణయం తీసుకుంది. రైల్వేట్రాక్పై ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. జిల్లాలోని పేరేచర్ల రైల్వే ట్రాక్పై ఆ జంట ఆత్మహత్య(lovers-suicide)కు పాల్పడింది. ప్రేమికులిద్దర్ని గోపి, ప్రియాంక(Gopi, Priyanka) గా గుర్తించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా(Guntur District) ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడుకు చెందిన గోపి తెనాలి (Tenali) మండలం అత్తోటకు చెందిన లక్ష్మీ ప్రియాంకలు నరసరావుపేటలోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు.
నెల 5వ తేదీన పెళ్లి చేసుకున్నారు
గోపి, లక్ష్మీ ప్రియాంక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురు తల్లిదండ్రులకు తెలిపారు. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇరువురు ఈ నెల 5వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అనంతరం పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువైపుల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ, రెండు వైపులా పెద్దలు వీరి పెళ్ళిని అంగీకరించలేదు. రెండు రోజుల క్రితం గోపి ఇంటినుంచి వెళ్లిపోయి పేరేచర్ల సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ ప్రియాంక మరుసటి రోజు ఆమె అదే రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరి మృతదేహాలను గుర్తించిన రైల్వే పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Poll not found.
Read hindi news: hindi.vaartha.com
Read Also: