📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Mancherial Crime: కిందపడి మరణించిన వృదురాలు..చేతులు తిన్న పెంపుడు పిల్లులు

Author Icon By Anusha
Updated: March 14, 2026 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mancherial Crime: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని భగత్ సింగ్ నగర్‌లో అత్యంత హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న జక్కనబోయిన లక్ష్మి (80) అనే వృద్ధురాలు తన ఇంట్లోనే ప్రాణాలు కోల్పోగా, ఆమె పెంచుకున్న పిల్లులే మృతదేహాన్ని పీక్కుతినడం కలకలం రేపింది. భర్త రాజీరు మరణం తర్వాత నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ, లక్ష్మి తన సొంత ఇంట్లోనే ఒంటరిగా కాలం వెళ్లదీస్తోంది.

Read Also: Oman Drone Attack: డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి

నాలుగు రోజులుగా రాని కుమారుడు

లక్ష్మికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగి వేర్వేరుగా నివసిస్తుండటంతో, రెండో కుమారుడు సముందర్ తల్లి బాగోగులు చూసుకునేవాడు. వారానికి రెండుసార్లు వచ్చి తల్లిని పరామర్శించి వెళ్లే సముందర్, గత నాలుగు రోజులుగా సముందర్ తల్లిని చూసేందుకు రాలేదు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ గురువారం ఇంట్లో గడప ముందు కుప్పకూలిపోయింది వృద్దురాలు లక్ష్మి.

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వృద్దురాలిని ఎవరు గుర్తించలేదు.. తలుపులు తెరిచి ఉండటం.. ఇంట్లో లైట్లు వేసి లేకపోవడంతో రాత్రివేళ గుర్తించిన స్థానికులు లక్ష్మిని పలకరించేందుకు వెళ్లారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. వృద్దురాలు లక్ష్మి అపస్మారక స్థితిలో పడి కనిపించింది.. చేతిని పూర్తిగా ఎవరో కొరికినట్టుగా ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. కొడుకు సమేందర్ కు సైతం సమాచారం ఇచ్చారు. కొడుకు సమేందర్ అర్థరాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి పెంపుడు పిల్లులు రెండు ఇంట్లో తిరుగుతూ కనిపించాయి.

Mancherial Crime: Tigers, not domestic cats, devoured an elderly woman

కేసు నమోదు

వృద్దురాలి చేతి చర్మం పిల్లుల వద్ద కనిపించడంతో పెంపుడు పిల్లులే చేతిని కొరికినట్టుగా ప్రాథమిక నిర్దారణకు వచ్చాడు కొడుకు సముందర్. ఇంట్లో ఉన్న రెండు పెంపుడు పిల్లులు ఆ వృద్దురాలు చేతిని చాలా వరకు పీక్కుతినడం స్థానికులను కలచివేసింది. అయితే తల్లి లక్ష్మి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని.. తన తల్లి ప్రమాదవశాత్తే చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి పెద్ద కొడుకు శ్రీనివాస్.. తల్లి లక్ష్మీ మృతిపై మాకు ఎవరిపై అనుమానం లేదంటూ కుమారులు ఫిర్యాదులో పేల్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు‌.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Heartbreaking Incident Mancherial crime Old Woman Pet Cats Attack Dead Body

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.