పిల్లలను క్రమశిక్షణతో, భద్రతతో పెంచే బాధ్యతను తల్లులు నిర్లక్ష్యం చేస్తే కుటుంబ వ్యవస్థతో పాటు సమాజం కూడా ప్రమాదంలో పడుతుందని మద్రాస్ హైకోర్టు(Madras) కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Read Also: AP Crime: దోమల చక్రం వల్ల బాలుడు మృతి
కోయంబత్తూర్ ఘటనపై కేసు వివరాలు
కోయంబత్తూర్కు చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయి తన 14 ఏళ్ల కూతురితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 2017లో ఆ వ్యక్తి బాలికపై లైంగిక దృష్టి పెట్టి వేధింపులకు పాల్పడినట్టు కేసులో వెల్లడైంది. బాలిక తనపై జరుగుతున్న వేధింపులను తల్లికి చెప్పగా, ఈ విషయం ఎవరికి చెబితే ఆత్మహత్య చేసుకుంటానని తల్లి బెదిరించినట్టు కోర్టు ముందు వెల్లడైంది. ఆ తరువాత కూడా ఆ వ్యక్తి బాలికను లైంగికంగా వేధించడం కొనసాగించాడు.
పోక్సో కోర్టు తీర్పు, హైకోర్టు నిర్ణయం
చివరికి బాలిక తన తండ్రికి జరిగిన ఘటనను తెలియజేయడంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి మరియు ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోయంబత్తూర్ పోక్సో కోర్టు 2020లో ఇద్దరికీ జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ వారు మద్రాస్ హైకోర్టులో(Madras) అప్పీల్ దాఖలు చేశారు. అయితే జస్టిస్ వేల్మురుగన్, జస్టిస్ జ్యోతిరామన్లతో కూడిన ధర్మాసనం, పోక్సో కోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అవసరం లేదని పేర్కొంటూ అప్పీల్ను తిరస్కరించింది.
తల్లుల బాధ్యతపై హైకోర్టు స్పష్టత
తల్లుల అనైతిక ప్రవర్తన వల్లే చిన్నారులపై ఇలాంటి లైంగిక నేరాలు జరుగుతున్నాయని కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మన సంస్కృతిలో తల్లికి ఉన్న గౌరవం, ప్రాధాన్యతను గుర్తుచేసింది. పిల్లలను సురక్షితంగా, గౌరవంతో, క్రమశిక్షణతో పెంచడం తల్లుల ప్రధాన బాధ్యత అని వ్యాఖ్యానించింది. ఆ పవిత్రమైన బాధ్యతను విస్మరిస్తే కుటుంబం మాత్రమే కాక సమాజం కూడా తన పునాదులను కోల్పోయే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: