మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా బర్వాహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను హత్య చేసి, ఆ మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి, అనంతరం భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఘటన వివరాల్లోకి వెళితే
45 ఏళ్ల లక్ష్మణ్, 40 ఏళ్ల రుక్మిణీబాయి అనే దంపతులు ఖర్గోన్ జిల్లాలో నివసిస్తున్నారు. వారి మధ్య ఇటీవల తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన వెలువడుతుండటంతో గ్రామస్థులలో అనుమానం మొదలైంది. తలుపులు మూసి ఉండటంతో పలుమార్లు పిలిచినా స్పందన రాకపోవడంతో, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రుక్మిణీ బాయి మృతదేహాన్ని వెలికి తీశారు. శరీరం పాక్షికంగా కుళ్లిపోయి ఉండటాన్ని బట్టి, హత్య జరిగి నాలుగైదు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాన్ని సరిగా పూడ్చకపోవడం వల్ల చేయి బయటకు కనిపిస్తోందని, దానివల్లే దుర్వాసన వ్యాపించిందని పోలీసులు తెలిపారు. భార్యను పాతిపెట్టిన తర్వాత లక్ష్మణ్ నాలుగైదు రోజులుగా అదే మంచంపై నిద్రపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది.
భయంతో పురుగుల మందు తాగి మృతి
భార్య హత్య వెలుగులోకి వస్తే తనపై కేసు నమోదవుతుందన్న భయంతో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత హత్య మరియు ఆత్మహత్యకు సంబంధించి స్పష్టమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Read also: Tragedy : గోవాలో ఘోర విషాదం.. ఆరుగురు మృతి