📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Madhya Pradesh Crime: రైతు కళ్లలో కారం.. రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

Author Icon By Saritha
Updated: December 31, 2025 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రదేశ్ (Madhya Pradesh Crime) రాష్ట్రం అశోక్‌నగర్ జిల్లాలోని తమోయియా చక్ గ్రామానికి చెందిన 47 ఏళ్ల రైతు లఖ్విందర్‌పై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు దాడి చేసి భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. రైతు కళ్లలో కారం కొట్టి, రూ.25 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వివేక్ శర్మ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Read Also:  Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు?

మొబైల్ తీసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్తుండగా దాడి

ఉదయం 10 గంటల ప్రాంతంలో, ఇంటి నుండి కొద్ది దూరం చేరుకున్న తర్వాత, మొబైల్ తీసుకోవడానికి ఇంటికి తిరిగి వస్తుండగా దాడి జరిగింది.కొంత దూరం వెళ్లిన తర్వాత తన మొబైల్ ఫోన్ ఇంట్లో మర్చిపోయినట్లు రైతుకు గుర్తొచ్చింది. వెంటనే బైక్‌ను తిరగబెట్టి మొబైల్ తీసుకోవడానికి ఇంటివైపు బయలుదేరాడు. అదే సమయంలో రోడ్డుపక్కన నిల్చున్న దుండగులు అతడిని ఆపి, సమీపంలోని ఒక పొలం గురించి ప్రశ్నలు అడిగారు.

Madhya Pradesh: Farmers’ eyes are filled with sorrow.. Thieves who stole 25 lakhs in cash

మాట్లాడుతున్న సమయంలో ఆ దుండగుల్లో ఒకరి చేతిలో ప్లాస్టిక్ సంచి ఉంది. అకస్మాత్తుగా అతడు ఆ సంచిని తెరిచి రైతు కళ్లలో కారం పొడి విసిరాడు. ఒక్కసారిగా చూపు మసకబారడంతో రైతు తడబడిపోయాడు. తన వద్ద ఉన్న సంచిని కాపాడుకునేందుకు ప్రయత్నించగా, రెండో దుండగుడు ఆ సంచిని లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Ashoknagar District Farmer Robbed latest news Madhya Pradesh Robbery Case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.