ఆ ఇల్లాలు భర్తను ప్రేమించి పెళ్లాడింది. కోటిఆశలతో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ప్రేమించినవాడే తన ఊపిరిగా భావించింది. కానీ ఆ ప్రియుడే తన ప్రాణం తీసుకునేంతగా వేధిస్తాడని భావించలేకపోయింది. పట్టుమని నాలుగు నెలలు పూర్తికాకముందే ఆమె అర్థాంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది. అత్తింటి ఆరళ్లకు ఆమె బలైపోయింది. ప్రేమించి పెళ్లాడిన భర్త శాడిస్ట్గా మారడంతో ఆమె సెల్ఫీ వీడియోను తీసి, ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య (Suicide by hanging)కు (Sucide) పాల్పడింది. ఈవీడియో వైరల్గా మారింది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో (Lucknow) లో బికెటి పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న అనురాగ్సింగ్, సౌమ్యకశ్యప్ ఇద్దరు ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అయితే కట్నం కోసం భర్త, అత్తమాలు, అతని బావ, బావసోదరుడి వేధించడం ఆరంభించారు. డబ్బు, అధికారం చూసుకుని భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. సౌమ్యను మరో వివాహం చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు.
సెల్ఫీ సూసైడ్
సౌమ్యకశ్యప్ ఆత్మహత్యకు పాల్పడేముందు సెల్ఫీవీడియోను తీసుకుంది. ‘నిస్సహాయులైన బేటీలకు రక్షణ ఏదంటూ’ వాపోయింది. అంతేకాదు సౌమ్య తన అత్తమామలపై, భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తన భర్త, అత్తమామలు తనను తిరిగి వివాహం చేసుకోవాలని, మానసికంగా వేధించారని సౌమ్య కన్నీటితో తన గోడును చెప్పుకుంది. తన
బావమరిది తనను చంపేస్తానని బెదిరించాడని సౌమ్య ఆరోపించింది. ‘డబ్బుతో వారు ఏమైనా చేయగలరు. న్యాయం కోసం పోలీసుల చుట్టు తిరిగినా తన గోడు ఎవరూ వినలేదని, తనను ఇంతగా హింసించి, బతకలేని పరిస్థితులు కల్పించిన ఎవరినీ వదలొద్దు’ అంటూ సూసైడ్కి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో సౌమ్య కశ్యప్ ఆరోపించింది. అనంతరం సౌమ్య తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని (Sucide) మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుటుంబం అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Crime: కంటి రెప్పే కాటువేస్తే..!