ఉత్తరప్రదేశ్లో ఒక సోషల్ మీడియా పరిచయం చివరకు ప్రాణాంతకంగా మారింది. ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లతో తన వయసును దాచిపెట్టి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపిన 52 ఏళ్ల మహిళ చివరకు అదే యువకుడి చేతిలో దారుణంగా హత్యకు గురైన సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూపీ (Uttar Pradesh) లోని మెయిన్పురి జిల్లాకు చెందిన 26 ఏళ్ల అరుణ్ రాజ్పుత్, ఫరూఖాబాద్కు చెందిన 52 ఏళ్ల రాణి ఏడాదిన్నర క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యారు. నలుగురు పిల్లల తల్లి అయిన రాణి, తన నిజమైన వయసు బహిర్గతం కాకుండా ఉండేందుకు సోషల్ మీడియా ఫిల్టర్లను వినియోగిస్తూ యువతిగా కనిపించేది. ఆమె ఫోటోలు చూసి మోసపోయిన అరుణ్, రాణితో చాట్లు మొదలుపెట్టాడు. క్రమంగా ఇద్దరి మధ్య సంబంధం గాఢమై, ప్రేమాయణం వరకు వెళ్లింది.
పూర్తి వివరాలు
తర్వాత ప్రత్యక్షంగా కలుసుకుని ఫరూఖాబాద్లోని పలు హోటళ్లలో కలుసుకునేవారు. ఈ క్రమంలో రాణి, అరుణ్ (Rani, Arun) కు సుమారు రూ.1.5 లక్షలు కూడా ఇచ్చింది.కొంతకాలంగా రాణి తనను పెళ్లి చేసుకోవాలని, ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అరుణ్పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. “ఆగస్టు 10న అరుణ్ ఆమెను మెయిన్పురికి పిలిచాడు. పెళ్లి, డబ్బు విషయమై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన నిందితుడు, ఆమె చున్నీతోనే గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు” అని నగర పోలీస్ చీఫ్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.

తన కుటుంబ సభ్యులకు చెబుతానని
మరుసటి రోజు మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఆమె వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు ప్రారంభించారు. కాల్ రికార్డులు, సోషల్ మీడియా ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరుణ్ తన నేరాన్ని అంగీకరించాడు. పెళ్లి చేసుకోకపోతే పోలీసులకు లేదా తన కుటుంబ సభ్యులకు చెబుతానని రాణి బెదిరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. “వారిద్దరి మధ్య సంభాషణలు, ఫోటోలు ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. నిందితుడిని జైలుకు తరలించాం” అని పోలీసులు వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: