సినీ ప్రపంచం అంటే చాలా మంది అభిమానులకు మోజు. హీరోలు, హీరోయిన్లు తెరపై ఎలా కనిపిస్తారో, వారు వేసే దుస్తులు, వారి శరీర భంగిమ, వారి స్టైల్ అన్నీ చాలా మందికి ఆకర్షణగా ఉంటాయి. ఈ మోజు కొన్నిసార్లు అతి స్థాయికి చేరుతుంది. తెరపై చూసే ఆ ఆకర్షణ నిజ జీవితంలో కూడా కావాలని ప్రయత్నించే వారు కొందరు ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల అందం, గ్లామర్కి మగవారు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. అలాంటి ఆలోచనలను తమ కుటుంబ జీవితంలోకి తీసుకువచ్చి, భార్యలను వేధించే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుని, ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
గ్లామర్గా రెడీ కావాలని బలవంతం చేయడం
ఉత్తరప్రదేశ్కి చెందిన ఓ వ్యక్తి బాలీవుడ్ నటి నోరా ఫతేహి (Bollywood actress Nora Fatehi) పట్ల ప్రత్యేకమైన మోజు పెంచుకున్నాడు. తెరపై ఆమె డ్యాన్స్లు, శరీర సౌందర్యం చూసి పూర్తిగా ప్రభావితమయ్యాడు. ఆ మోజు తన భార్య జీవితాన్ని దుర్భరంగా మార్చింది. భార్యను నోరా ఫతేహిలా తయారవ్వాలని, ఆమెలా శరీర ఆకృతిని కలిగి ఉండాలని రోజూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. భార్యను అలాంటి గ్లామర్గా రెడీ కావాలని బలవంతం చేయడంతో పాటు, తనకు నచ్చని రూపంలో ఉందని తరచూ విమర్శించేవాడు.ప్రతీ ఒక్కరికీ వారి శరీర నిర్మాణం, స్వభావం వేరు. కానీ ఆ భర్త మాత్రం ఈ విషయాన్ని అంగీకరించలేదు. తన భార్య తప్పనిసరిగా సినీ హీరోయిన్లా కనిపించాలనే పట్టుదలతో ఆమెపై ఒత్తిడి పెంచుతూ వచ్చాడు.
అత్తమామలు తన శారీరక రూపాన్ని ఎగతాళి చేసేవారు
మాటలతోనే కాదు, శారీరకంగా కూడా వేధింపులు (Physical harassment) పెట్టినట్లు సమాచారం. భర్త అతి మోజు భార్య జీవితాన్ని నరకంగా మార్చేసింది.బాధితురాలు ఈ ఏడాది మార్చి 6న మీరట్కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ అయిన శివం ఉజ్వల్ను వివాహం చేసుకుంది. ఆమె సాధారణ ఎత్తు, రంగు ఉన్నప్పటికీ.. తన భర్త, అత్తమామలు తన శారీరక రూపాన్ని ఎగతాళి చేసేవారు. పెళ్లి తర్వాత తన జీవితం నాశనమైందని, తనకి నోరా ఫతేహి లాంటి అమ్మాయి కావాలంటూ శివం వేధించేవాడు. నోరా ఫతేహిలా కనిపించడానికి.. రోజుకు మూడు గంటలు వ్యాయామం చేయాలని భర్త తనపై ఒత్తిడి చేసేవాడని భార్య తెలిపింది. ఒకవేళ ఏ రోజైనా మూడు గంటలు వ్యాయామం చేయకపోతే, ఆ రోజు ఆహారం ఇవ్వకుండా వేధించేవాడని ఆరోపించింది.

గర్భస్రావ మాత్రలు
ఈ వేధింపులే కాకుండా తన భర్త ఇతర మహిళల పట్ల మోజు పడతారని.. సోషల్ మీడియాలో వారి అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు చూసేవాడని ఆ మహిళ ఆరోపించింది. తాను గర్భవతి అయినప్పుడు తన భర్త రహస్యంగా గర్భస్రావ మాత్రలు ఇచ్చాడని ఆరోపించింది. అంతే కాకుండా అదనపు కట్నం కోసం తన అత్తమామలు కూడా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లిలో దాదాపు రూ. 76 లక్షలు ఖర్చు చేశామని, ఇందులో రూ. 16 లక్షల విలువైన నగలు, రూ. 24 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో, రూ. 10 లక్షల నగదు ఇచ్చామని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, అత్త, మామ,వదినపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సమాజంలో పెరిగిపోతున్న కట్నం వేధింపులుమహిళల పట్ల దారుణమైన ప్రవర్తనకు అద్దం పడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: