2017 జూన్ 24 రాత్రి ఉదయపూర్లో జరిగిన ఘోర ఘటనను గుర్తుచేసుకుంటే, ఇప్పటికీ ప్రజల మనసులు వణుకుతున్నాయి. ఈ సంఘటనలో భర్త తన భార్యపై అమానవీయ కృత్యాన్ని జరిపాడు. ఆ భార్యపై భర్త చేసిన యాసిడ్ దాడి (Acid attack), ఆ తర్వాత శరీరాన్ని అగరుబత్తులతో కాల్చిన ఘోరమైన చర్యలు మొత్తం ప్రాంతాన్ని షాక్ చేశాయి.సాధారణంగా, “నువ్వు నల్లగా ఉన్నావు, ఈ క్రీమ్ రాస్తే నువ్వు అందంగా మారుతావు” అనే మాటలు సాధారణంగా ప్రేమ, శ్రద్ధ కోసం వాడే మాటలా ఉంటాయి. కానీ ఈ సందర్భంలో భర్త ఈ మాటలను మహిళను మోసపెట్టడానికి, తన భార్యను హానిచేయడానికి ఉపయోగించాడు. భర్త ఆ మాటలతో మోసం చేసిన తర్వాత, ఆమె శరీరంపై యాసిడ్ పోసాడు. యాసిడ్ ప్రభావం ఘోరంగా, వేగంగా వ్యాపించి, మహిళ శరీరంపై తీవ్రమైన మంటలు ఏర్పడ్డాయి.ఆ మహిళ కొద్దిసేపటికే మరణించింది.
పూర్తి వివరాలు
నవానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లభ్నగర్ నివాసి కిషన్ లాల్ అలియాస్ కిషన్ దాస్ తన భార్య లక్ష్మిని అందంగా లేవంటూ తరచూ ఎగతాళి చేసేవాడు. ఆమెను నల్లగా, లావుగా ఉందని నిత్యం అవమానించి వేధించేవాడు. ఈ వేధింపులు చివరకు జూన్ 24, 2017 రాత్రి ఆమె హత్యకు దారితీశాయి. ఆ రోజు రాత్రి, కిషన్ దాస్ (Kishan Das) తన భార్య లక్ష్మి బట్టలు తొలగించి.. ఆమె శరీరంపై ఒక రసాయన క్రీమ్ లాంటి పదార్థాన్ని పూశాడు. ‘‘ఇది నిన్ను అందంగా మారుస్తుంది’’ అని చెప్పాడు. కానీ ఆ క్రీమ్ యాసిడ్ వాసన వచ్చింది. తర్వాత అతను తన చేతిలో ఉన్న అగరుబత్తులు వెలిగించి ఆమె శరీరంపై అంటించాడు. యాసిడ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి లక్ష్మీ శరీరమంతా మంటల్లో కాలిపోయింది. తీవ్రమైన బాధతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
రసాయన క్రీమ్ లాంటి పదార్థాన్ని
ఈ దారుణ ఘటనతో భయపడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నవానియా పోలీసులు నిందితుడు కిషన్ దాస్ను అరెస్టు చేశారు. ఈ కేసు తీవ్రతను గమనించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేష్ చంద్ర పలివాల్, కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరపున 14 మంది సాక్షులు, 36 డాక్యుమెంట్ల ఆధారాలతో నిందితుడిపై నేరం రుజువైంది. మహిళలపై ఇలాంటి క్రూరమైన నేరాలకు కఠినమైన శిక్షలు విధించాలని పలివాల్ కోర్టును కోరారు.అన్ని వాదనలు విన్న తర్వాత, అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రాహుల్ చౌదరి కీలకమైన తీర్పును వెలువరించారు. ఈ నేరం కేవలం ఒక హత్య మాత్రమే కాదని, ఇది సమాజం ఆత్మను కదిలించే నేరమని అన్నారు. ఇలాంటి వ్యక్తికి పునరావాసం కల్పించడం అసాధ్యమని, అందుకే అతడికి మరణశిక్షతో పాటు రూ. 50,000 జరిమానా విధించారు. ఈ తీర్పు మహిళల భద్రతకు ఒక మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: