Latest News: Crime News ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు..ఎక్కడంటే?

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన సమాజాన్ని కలిచివేస్తోంది. తల్లి ప్రేమ ఎంత పవిత్రమో మనందరికీ తెలిసిందే. పిల్లల కోసం తల్లి తన ప్రాణాలని పణంగా పెట్టి, ఎక్కువగా కష్టపడుతుంది. తల్లి రక్తమాంసాలను పంచి పెంచి, కంటికి రెప్పలా కాపాడుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. కానీ ఇంతటి అపారమైన తల్లి ప్రేమకు కొందరు సంతానం విలువ ఇవ్వకపోవడం బాధాకరం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మనసును కలచివేస్తోంది.నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నాగిరెడ్డిపేట్ మండలం తాండూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు తన తల్లిని బీమా సొమ్ము కోసం హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలు

అయితే, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ యువకుడు తల్లిని హత్య చేయాలని దారుణ నిర్ణయం తీసుకున్నాడు.వివరాల్లోకి వెళితే.. తాండూరు గ్రామానికి చెందిన చాకలి జమున (46) అనే మహిళ గత జనవరి 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఆమె ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడి మరణించినట్లు కేసు నమోదు చేశారు. అయితే ఆరు నెలల తర్వాత ఆమె కుమారుడు చాకలి రాజు (28) మరో హత్యాయత్నం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో భాగంగా.. పోలీసులు రాజును ప్రశ్నించగా తన తల్లి మరణానికి సంబంధించిన అసలు విషయం వెలుగులోకి వచ్చింది.రాజు ప్రవర్తన సరిగా లేదని, అది మార్చుకోవాలని తల్లి జమున (Mother Jamuna) పలుమార్లు అతడిని హెచ్చరించింది. తల్లి మాటలు వినని రాజు, ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు.

Latest News
Latest News

ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులను నమ్మించాడు

ఇదే సమయంలో జమున పేరిట వివిధ బీమా సంస్థల్లో సుమారు రూ. 80 లక్షల ప్రమాద బీమా ఉందని తెలుసుకున్న రాజు ఆ డబ్బుపై ఆశ పెంచుకున్నాడు. తల్లి చనిపోతేనే ఆ సొమ్ము దక్కుతుందని భావించిన దుర్మార్గుడు.. జనవరి 9న జమున తలపై బండరాళ్లతో బలంగా కొట్టి చంపాడు. అప్పుడు అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులను నమ్మించాడు.తాజాగా హత్యాయత్నం కేసు విచారణ సమయంలో రాజు తన తల్లిని తానే బండరాళ్లతో కొట్టి చంపినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. రాజు వాంగ్మూలంతో పోలీసులు జమున కేసును తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారాయో చూపిస్తోంది. డబ్బు, ఆస్తుల కోసం తల్లిదండ్రులను హత్య చేయడం వంటి నేరాలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. తల్లిదండ్రుల ప్రేమకు ప్రతిఫలంగా ఇలాంటి దారుణాలు చేయడం మానవత్వానికే మచ్చ.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/congress-we-should-celebrate-victory-in-local-body-elections/telangana/533721/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.