Latest News: Kurnool Bus Accident: అంతులేని ఆమె వేదన.. భర్త కూతురు కోల్పోయిన విషాదం

Read Time:  1 min
Kurnool Bus Accident
Kurnool Bus Accident
FONT SIZE
GET APP

కర్నూలు (Kurnool) వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. అయితే, గన్నమనేని ధాత్రి కుటుంబం అనుభవిస్తున్న వేదన మాత్రం మాటల్లో చెప్పలేనిది. గన్నమనేని ధాత్రి తల్లి వాణి ఆవేదన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. రెండేళ్ల కిందట అనారోగ్యంతో భర్త మరణించగా.. ఇప్పుడు ఉన్న ఏకైక కూతురు కూడా శాశ్వతంగా దూరమైంది.

Nirmal Crime: బాలుడిపై సీనియర్ల లైంగిక దాడి

రెండేళ్ల వ్యవధిలోనే భర్త మరణంతో దిక్కుతోచక విలవిలలాడుతున్న ఆ తల్లి బాధ వర్ణనాతీతం.యద్దనపూడి మండలం పూనురూకు చెందిన గన్నమనేని భానుప్రకాష్- వాణి దంపతులకు ధాత్రి ఏకైక సంతానం. భానుప్రకాష్ గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేవారు.

 Kurnool Bus Accident
 Kurnool Bus Accident

ధాత్రి బెంగళూరు (Bangalore) లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం

అయితే రెండేళ్ల కిందట అనారోగ్య సమస్యలతో ఆయన మరణించడంతో భార్య, బిడ్డ ఒంటరయ్యారు. భర్త మరణం అనంతరం వాణి  ఇంకొల్లు మండలం పూసపాడులోని తల్లి సూర్యకుమారి వద్ద ఉంటోంది. మరోవైపు ధాత్రి బెంగళూరు (Bangalore) లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తల్లికి అండగా నిలుస్తోంది.

కూతురు సెటిల్ అవడంతో ఇక ఆమెకు పెళ్లి చేయాలని మంచి సంబంధాల కోసం చూస్తున్నారు వాణి. కానీ, ఇంతలోనే బస్సు ప్రమాదం (Kurnool Bus Accident) ఆ తల్లి ఆశలను సమాధి చేసింది. బస్సు ప్రమాదంలో (Kurnool Bus Accident) ధాత్రి కాలి బూడిదైపోయింది. కూతురి చివరి చూపుకు కూడా నోచుకోలేకపోవడంతో తల్లి వాణి గుండెపగిలేలా రోదిస్తున్నారు. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.