📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News: Kurnool Bus Accident: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం

Author Icon By Aanusha
Updated: October 24, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు (Kurnool) జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర శుక్రవారం తెల్లవారజామున కావేరి ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సుకు మంటలు అంటుకున్నాయి.ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ సిరి అధికారికంగా ధ్రువీకరించారు. మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు ఉండటం అందరినీ కలచివేస్తోంది.

Kurnool Crime: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర విచారం

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Hyderabad) నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా సజీవ దహనమయ్యారు.

ఉపాధి నిమిత్తం బెంగళూరు (Bangalore) లో స్థిరపడిన రమేష్ కుటుంబం, హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం బలి తీసుకుంది. కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి, ఘటనకు గల కారణాలను మీడియాకు వివరించారు.

 Kurnool Bus Accident

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్

బస్సు కిందకు ఒక బైక్ దూసుకురావడంతో, డోర్ తెరుచుకోవడానికి ఉపయోగపడే కేబుల్ తెగిపోయిందని తెలిపారు. ఈ ఘటన తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయని, సుమారు 20 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతైందని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశామని, మరో 20 మంది క్షేమంగా బయటపడ్డారని ఆమె వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Kurnool bus accident latest news Nellore family dies Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.