हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News:Khammam Crime: విడాకుల వివాదం హత్యకు దారితీసింది

Pooja
Telugu News:Khammam Crime: విడాకుల వివాదం హత్యకు దారితీసింది

ఖమ్మం జిల్లా(Khammam Crime) ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామునే ఘోర హత్య జరిగింది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు మరియు గ్రామస్తుల సమాచారం ప్రకారం, మూడు సంవత్సరాల క్రితం మొటపోతుల వెంకన్న కుమార్తె అఖిలకు అదే గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ను వివాహం చేశారు. అయితే గత ఏడాది నుంచి దంపతుల మధ్య విభేదాలు పెరిగి తరచూ గొడవలు జరిగేవి. పెద్దలు పలు సార్లు పంచాయతీ చేసినా సమస్య పరిష్కారం కాలేదు. చివరికి మహేష్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, ఇటీవల విడాకులు మంజూరైనట్లు తెలిసింది.

Khammam Crime
Khammam Crime

Read Also: Nirmal Crime: వట్టోలి గ్రామంలో ప్రేమజంట ఆత్మహత్య

తిరిగి భార్యగా అంగీకరించాలని డిమాండ్ – ఘర్షణ రక్తపాతం

మంగళవారం ఉదయం(Khammam Crime) అఖిల తండ్రి వెంకన్న, తన కుమార్తె అఖిల, కుమారుడు మనోజ్‌, బావమరిది యల్ది వెంకన్న (మహబూబాబాద్ జిల్లా దేవునిసంకీస గ్రామం)తో కలిసి మహేష్ ఇంటికి వచ్చారు. అఖిలను తిరిగి భార్యగా అంగీకరించాలని వెంకన్న డిమాండ్ చేయడంతో మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత వెంకన్న కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కొద్దిసేపటి తర్వాత వెంకన్న తన కుమారుడు మనోజ్‌, బావమరిది యల్ది వెంకన్నతో కలిసి కర్రలు మరియు కత్తులతో తిరిగి మహేష్ ఇంటికి వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో మహేష్‌ కడుపు మరియు వెన్నుప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడిపోయిన కుమారుడిని కాపాడేందుకు ముందుకు వచ్చిన తల్లి నాగమణిపై కూడా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

నిందితులు లొంగిపోయిన ఘటన – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది

స్థానికుల సహాయంతో మహేష్‌ను ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ఎం. రాజు, ఎస్‌హెచ్‌ఓలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన నిందితులు వెంకన్న, మనోజ్‌, యల్ది వెంకన్న రూరల్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. గ్రామస్తుల ప్రకారం, నిందితులు కావాలనే పక్కా ప్లాన్‌ ప్రకారం హత్య చేసి పోలీసులకు లొంగిపోయారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870