📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంపై దర్యాప్తులో కీలక పురోగతి

Author Icon By Aanusha
Updated: October 25, 2025 • 8:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు (Kurnool) జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని దుఃఖంలో ముంచేసింది.అయితే ఈ ఘటనకు సంబంధించిన విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.వందల మొబైల్ ఫోన్లు (Mobile phones) ఒక్కసారిగా పేలడం వల్లే మంటలు తీవ్రరూపం దాల్చి, భారీ ప్రాణనష్టం సంభవించిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ప్రమాదానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Thamma Movie: థామా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్.. కారణం ఏంటంటే?

కావేరి ట్రావెల్స్‌ (Kaveri Travels) కు చెందిన బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఘర్షణ తలెత్తి నిప్పురవ్వలు చెలరేగాయి.

Kurnool Bus Accident

ఆ నిప్పురవ్వలు లీకైన పెట్రోల్‌కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి.అయితే, తొలుత ఈ మంటలు బస్సు లగేజీ క్యాబిన్‌కు వ్యాపించాయి. ఆ క్యాబిన్‌లో 400కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్న పార్సిల్ ఉందని అధికారులు గుర్తించారు. మంటలు ఆ పార్సిల్‌కు అంటుకుని, ఫోన్లలోని బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి.

బస్సు ముందు భాగంలోని సీట్లు, బెర్తుల్లో

దీంతో క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి లగేజీ క్యాబిన్ పైనున్న ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి.ఈ ఘటనలో బస్సు ముందు భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలు (Forensic teams) సేకరించిన ఆధారాలతో పోలీసులు ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Bus Accident Forensic Report Kurnool News latest news mobile battery blast Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.