కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని టిన్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద గత శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మణిపూర్కు చెందిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే, మణిపూర్కు చెందిన హన్నా ఇనాకా (20) స్నేహితుడితో కలిసి స్కూటర్పై వెళ్తుండగా, కె.ఆర్. పురం రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడగా, బస్సు చక్రాలు ఆమెపై నుంచి వెళ్లడంతో హన్నా మరణించింది.
Read Also: Union Home Minister: నక్సలిజంపై అమిత్షా కీలక సమావేశం
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: