Karnataka Crime: విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరు నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. పెళ్లై ఇంకా నెల కూడా గడవకముందే, నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన ఆ జంటను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Also: Srinagar Protests: భారీ నిరసనలు.. శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
ఆలయానికి వెళ్లి వస్తుండగా విషాదం
శిగ్గావ్కు చెందిన కార్తిక్ (34), ఐశ్వర్య (30)లకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఘనంగా వివాహం జరిగింది. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట, ఆదివారం గదగ్ జిల్లా నవలగుందలో ఉన్న ప్రసిద్ధ కామణ్ణ ఆలయానికి కారులో వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన క్రమంలో హావేరి జిల్లా నీరలగి క్రాస్ రోడ్డు వద్ద మృత్యువు లారీ రూపంలో పొంచి ఉంది.
వెనుక నుంచి ఢీకొన్న లారీ – అక్కడికక్కడే మృతి
వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ఒక వేగవంతమైన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అవ్వగా, కారులో ఉన్న కార్తిక్, ఐశ్వర్యలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: