📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Karnataka Crime: దేవనహళ్లిలో మహిళ దారుణ హత్య

Author Icon By Aanusha
Updated: February 25, 2026 • 12:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Karnataka Crime: కర్ణాటకలోని బెంగళూరు జిల్లా, దేవనహళ్లి తాలూకా కుందన గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 37 ఏళ్ల రేణుక అనే మహిళ ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు మూలం నిందితుడు రంజిత్ ప్రవర్తనేనని పోలీసులు గుర్తించారు. గతంలో రంజిత్, రేణుక మైనర్ కుమార్తెను వివాహం చేసుకుంటానని ప్రతిపాదించగా, కుటుంబ సభ్యులు దానికి నిరాకరించారు. అంతేకాకుండా, బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణలతో అతనిపై పోక్సో (POCSO) కేసు నమోదు చేయించారు.

Read Also: Tirupati Bhuvana Suicide Case: భువన మృతి.. హత్య లేక ఆత్మహత్య?

Karnataka Crime: Brutal murder of a woman in Devanahalli

జైలు నుంచి వచ్చి కక్ష సాధింపు

పోక్సో కేసులో అరెస్ట్ అయిన రంజిత్ కొంతకాలం జైలులో ఉండి, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనను జైలుకు పంపారన్న కోపంతో రేణుక కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. గతరాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి రేణుక ఇంటిపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘర్షణలో నిందితులు రేణుకపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమెకు రక్తగాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Devanahalli Murder Karnataka crime POCSO Case Revenge Renuka Murder Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.