📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Kamareddy: నేనే కలెక్టర్ ని.. ఇక్కడే నా పోస్టింగ్ చివరకి ఏమైంది?

Author Icon By Rajitha
Updated: November 6, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సివిల్స్ పరీక్షల (Civil Services Examination) కు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న ఓ మహిళా అభ్యర్థి, తాను ఐఏఎస్‌ అయ్యాననే భ్రమలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన ఆమె, తానే కొత్త కలెక్టర్ అని ప్రకటించి కార్యాలయంలో హడావిడి చేసింది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డికి చెందిన ఆ మహిళ చాలా కాలంగా సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతోంది. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. చివరకు తాను ఉద్యోగంలో ఎంపికయ్యాననే భ్రమలో పడిపోయి, నేరుగా కలెక్టర్ కార్యాలయానికి చేరి తానే కలెక్టర్‌గా నియమితులయ్యానని ప్రకటించింది.

Read also: Chevella Accident: ముగ్గురు కూతుళ్ల పరిహారం చెక్కు.. ఆ తండ్రికి ఉప్పొంగిన దుఃఖం

Kamareddy: నేనే కలెక్టర్ ని.. ఇక్కడే నా పోస్టింగ్ చివరకి ఏమైంది?

పరీక్షల ఒత్తిడితో

Kamareddy: కార్యాలయంలోని అధికారులను తన “చాంబర్” ఎక్కడ ఉందని అడిగుతూ గందరగోళం సృష్టించడంతో సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. తర్వాత సదరు మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడినుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు ఆమెను తూప్రాన్‌ వద్ద గుర్తించి విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఆ యువతి సివిల్స్ పరీక్షల ఒత్తిడితో మానసిక అస్థిరతకు గురై, కుటుంబాన్ని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడిందని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Fake Certificates IAS kamareddy latest news Telugu News UPSC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.