Kakinada Firecracker Blast: కాకినాడ జిల్లాలోని వేటపాలెం వద్ద బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఈ ఘోర ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ పేలుడు ఘటనలో మొత్తం మరణించిన వారి సంఖ్య 22కు చేరుకుంది.
Read Also: Kakinada Blast Updates: వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు
తాజా మృతుల వివరాలు
తాజాగా మరణించిన వారిని సామర్లకోటకు చెందిన పెదలోవరాజు (38), దర్శిపాటి రాజు (28)గా గుర్తించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (GGH)లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వీరు తుదిశ్వాస విడిచారు. వీరి మరణవార్తతో సామర్లకోటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇంకా విషమంగానే..
ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే బాధితులు తీవ్రమైన కాలిన గాయాలతో ఉండటంతో ప్రాణాపాయం పొంచి ఉందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేయడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: