Jharsuguda Road Accident: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు దుర్మరణం

Read Time:  1 min
Jharsuguda Road Accident: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు పోలీసులు దుర్మరణం
FONT SIZE
GET APP

Jharsuguda Road Accident: ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా ప్రయాణిస్తున్న పోలీసుల వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. జాతీయ రహదారి 49 (NH-49)పై ఝార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు పోలీసు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Read Also: UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య

అతివేగమే ప్రమాదానికి కారణమా?

విధులు ముగించుకుని బొలెరో వాహనంలో తిరిగి వస్తున్న పోలీసు సిబ్బందిని, ఎదురుగా అతివేగంగా వస్తున్న ట్రైలర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసు వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది.ఈ ప్రమాదంలో డ్రిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ కుజుర్, ఏపీఆర్ సిబ్బంది కాశీరామ్ భోయ్, దేవదత్త సా, హవల్దార్ లింగరాజ్ ధురువా, హోమ్ గార్డ్ భక్తబంధు మిర్ధా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

Jharsuguda Road Accident: Five policemen killed in road accident
Jharsuguda Road Accident: Five policemen killed in road accident

తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఝార్సుగూడ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.ప్రమాదానికి కారణమైన ట్రైలర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగం లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటించే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.