Jharkhand Plane Crash: జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగిని తరలిస్తున్న ఓ ఎయిర్ అంబులెన్స్ సాంకేతిక కారణాలతో కుప్పకూలింది. రాంచీ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఛాత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విమానం గాలిలో ఉండగానే నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది.
Read also: Railway Parcel Booking: ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!

విమానంలో ఏడుగురు ప్రయాణికులు
ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం ఏడుగురు ఉన్నారు.. వీరిలో పైలట్లు, వైద్య సిబ్బందితో పాటు రోగి, పారామెడిక్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో అందులో ఉన్న వారి పరిస్థితిపై ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం మేరకు రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: