మద్యం మత్తులో థార్ కారు బీభత్సం
హైదరాబాద్లోని ఎల్బీనగర్(L. B. Nagar) నియోజకవర్గ పరిధిలో బీఎన్రెడ్డినగర్ సమీపంలోని గుర్రంగూడ వద్ద శనివారం అర్ధరాత్రి భయానక రోడ్డు ప్రమాదం(Hyderabad Road Accident) జరిగింది. మద్యం మత్తులో థార్ కారు నడిపిన డ్రైవర్, ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో కారు అదుపు తప్పి బైక్ను ఢీకొట్టాడు.
Read also: Bapatla Sea Accident: బాపట్లలో సముద్రంలో విషాదం
ఆ బైక్పై సిరిసిల్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రయాణిస్తుండగా, ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో విద్యార్థినికి గాయాలు తీవ్రమై, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మూడు వాహనాలు ఢీ – ఐదుగురికి గాయాలు
బైక్ను ఢీకొట్టిన తర్వాత థార్ కారు డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టింది, ఆ కారులో ఉన్న దినేష్, శివలకు గాయాలయ్యాయి. అదుపు తప్పిన కారు మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన హైదరాబాద్లో(Hyderabad Road Accident) థార్ కారు డ్రైవర్ మరియు యజమాని అనిరుధ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అందరినీ హస్తినాపురంలోని రెండు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం ఎక్కడ జరిగింది?
ఎల్బీనగర్ పరిధిలోని గుర్రంగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి కారణం ఏమిటి?
డ్రైవర్ మద్యం మత్తులో అధిక వేగంతో కారు నడపడం వల్ల ప్రమాదం జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: