📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Hyderabad: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి

Author Icon By Sharanya
Updated: June 23, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad: హైదరాబాద్ (Hyderabad) శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఓ విషాదకర సంఘటన అందరినీ కలిచివేసింది. ఒక చిన్నారి బాలిక చెరువులో ప్రమాదవశాత్తూ పడి మృత్యువాత పడింది. ఆమెను కాపాడేందుకు నీటిలోకి దూకిన యువకుడూ ఆమెతో పాటు ప్రాణాలు విడవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ హృదయవిదారక ఘటన అదే ప్రాంతంలోని అనాజ్‌పూర్ చెరువు వద్ద చోటుచేసుకుంది.

వివరాలు:

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందినటువంటి చిన్నపురెడ్డి ప్రతాపరెడ్డి తన కుటుంబ సభ్యులతో అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసం ఉంటున్నాడు. వీళ్ళ బంధువులకు టిప్పర్లు ఉండడంతో అనాజ్‌పూర్ గ్రామంలో ప్రైవేట్ వెంచర్ల నిర్మాణం పనులను నడిపిస్తున్నారు.

ఘటన ఎలా జరిగిందంటే…

ప్రతాప్ రెడ్డి (Pratap Reddy) ఆదివారం సెలవు కావడంతో కూతురు ప్రణీతతో కలిసి ఆ చెరువు వద్దకు వెళ్లాడు. ప్రతాప్ రెడ్డి, కూతురు ప్రణీతతోపాటు బంధువు అయినటువంటి ఇంద్రసేనారెడ్డి (20) అనే యువకుడు కూడా వారి వెంట వెళ్లారు. అక్కడ ఒక వెంచర్ ఉండగా సమీపంలోనే ఇందిరా సాగర్ ఉంది. ఆ సమీపంలో ఆడుకునేందుకు వెళ్లినటువంటి ప్రణీత అలాగే కుటుంబ సభ్యులు కాసేపు సంతోషంగా ఫోటోలు దిగారు. అయితే, ఆడుకుంటున్న సమయంలో ఓ ప్రమాదవశాత్తూ ప్రణీత పక్కనే ఉన్న చెరువులోకి జారి పడింది. ఆమె కేకలు విన్న ఇంద్రసేనారెడ్డి ఒక్కసారిగా ఆమెను కాపాడేందుకు చెరువులోకి దూకాడు. ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

విషాదమయిన ముగింపు:

ఈత రాకపోయినా కూతురు, అలాగే అతని బంధువును కాపాడేందుకు ప్రతాపరెడ్డి చెరువులోకి దూకాడు. ఈ సమయంలో ఆయన కూడా మునిగిపోయాడు ఆ తర్వాత తన భార్య చీర కొంగు సహాయంతో బయటపడ్డాడు. అప్పటికే నీట మునిగిన స్పృహతప్పి పడిపోయిన ప్రతాపరెడ్డిని బయటకు తీసి హాస్పటల్ కు తరలించారు. వారి మృతదేహాలను స్థానికులు సహాయంతో వెలికితీయగా, వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది.

పోలీసుల దర్యాప్తు:

ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Suicide: భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య

#Abdullapurmet #CheruvuTragedy #ChildDrowns #HeroicAttempt #HyderabadNews #RIP #TelanganaNews #TragicIncident Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.