📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Hyderabad Crime News: భర్త వేధింపులు తాళలేక.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: October 15, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Hyderabad) చింతల్‌లో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకోవడం సోషల్ మీడియా, వార్తల వేదికల్లో పెద్ద దుఃఖాన్ని కలిగించింది. ఒక తల్లి, ఇద్దరు కవల పిల్లలను చంపి ఆ తర్వాత తన ప్రాణాలను తీసుకున్న సంఘటన వివాదాస్పదంగా మారింది.

Read Also: AP Crime: రైలులో దారుణం – మహిళపై దాడి, ఆభరణాలు లూటీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సాయిలక్ష్మి (27) (Sailakshmi) రెండేళ్ల వయసున్న తన పిల్లల మాటలు సరిగ్గా రావడం లేదని చిన్న కారణం పేరుతో భర్త నుండి మానసికంగా వేధింపులు ఎదుర్కొంది.తన జీవితం ముగించుకుంది.

ఏలూరు (Eluru) జిల్లా నూజివీడు (Nuzvidu) కు చెందిన చల్లారి అనిల్ కుమార్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులు పద్మారావునగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు (Software engineers) గా పనిచేస్తున్నారు.

సాయిలక్ష్మిని బాధ్యురాలిగా చేస్తూ తరచూ గొడవ

వీరికి రెండేళ్ల వయసున్న కవలలు చేతన్ కార్తికేయ, లాస్యతవల్లి సంతానం.కవలల్లో కుమార్తె లాస్యతవల్లి స్పష్టంగా మాట్లాడుతుండగా.. కుమారుడు చేతన్ కార్తికేయకు మాత్రం మాటలు సరిగా రావడం లేదు. జన్యుపరమైన సమస్యగా వైద్యులు గుర్తించిన ఈ విషయాన్ని భర్త అనిల్‌కుమార్ పదేపదే ప్రస్తావించేవాడు.

కొడుకు మాట్లాడలేకపోవడానికి సాయిలక్ష్మిని బాధ్యురాలిగా చేస్తూ తరచూ గొడవ పడేవాడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా భర్త వేధింపులు (Husband harassment) ఏమాత్రం తగ్గకపోవడంతో.. సాయిలక్ష్మి తీవ్ర మానసిక క్షోభకు గురైంది.

Hyderabad Crime News

పలుమార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం

ఆమె తల్లిదండ్రులు పలుమార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.భర్త అనిల్‌కుమార్ మంగళవారం విశాఖపట్నం వెళ్లాల్సి ఉండగా.. సోమవారం విధులు ముగించుకుని మియాపూర్‌ (Miyapur) లోని తన సోదరుడి ఇంటికి వెళ్లాడు.

ఆ రాత్రి భర్త వీడియో కాల్‌లో మాట్లాడిన తర్వాత సాయిలక్ష్మి కఠిన నిర్ణయం తీసుకుంది. తన ఆవేదనను, ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఆమె తల్లిదండ్రులను ఉద్దేశించి తన ఫోన్‌లో ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేసింది.

నాతో వచ్చిన వారు నాతోనే పోతారు

‘తన భర్త మారడు. అందుకే కష్టమైనా ఈ పొరపాటు చేస్తున్నా.. క్షమించండి. నేను లేనప్పుడు పిల్లలు ఉండడం అనవసరం. నాతో వచ్చిన వారు నాతోనే పోతారు’ అని ఆమె ఆ వీడియోలో రికార్డ్ చేసింది.మంగళవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న కవలలు కార్తికేయ, లాస్యతవల్లి ముఖాలపై దిండును అదిమి ఊపిరాడకుండా చేసి హతమార్చింది.

ఆ తర్వాత తాను నివసిస్తున్న భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాయిలక్ష్మి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని వీడియోను పరిశీలించారు. సాయిలక్ష్మి తండ్రి మారయ్యబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త అనిల్‌కుమార్, అతని అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News Hyderabad News latest news Sailakshmi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.