Hyderabad crime: హైదరాబాద్లోని రామ్నగర్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ (36) అనే వ్యక్తి లోన్ యాప్ వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.
Read also: Accident : జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అసలేం జరిగిందంటే?
ప్రేమ్ కుమార్ ఒక మొబైల్ యాప్ ద్వారా కేవలం రూ. 3,000 అప్పు తీసుకున్నారు. అయితే, సకాలంలో ఆ మొత్తాన్ని చెల్లించలేదనే కారణంతో సదరు యాప్ ఏజెంట్లు అతనిపై పైశాచికంగా వేధింపులకు దిగారు. బాధితుడినే కాకుండా, అతని కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా అసభ్యకరంగా మార్ఫింగ్ (Morphed Nude Photos) చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
మానసిక ఒత్తిడితో ఆత్మహత్య
నిత్యం వస్తున్న ఫోన్ కాల్స్, బ్లాక్మెయిల్ అరాచకాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమ్ కుమార్.. తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, లోన్ యాప్ మూలాలను కనిపెట్టేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: