Hyderabad (సరూర్ నగర్) : డబ్బుల కోసం ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన 9 మంది నిందితుల్లో ఏడుగురిని బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల నుండి కత్తులు, గొడ్డలితో పాటు ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బాలాపూర్ పిఎస్లో ఇన్స్పెక్టర్ సుధాకర్ తో కలిసి ఆదిభట్ల ఎసిపి ప్రదీప్కుమారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Read Also: Elections : తెలంగాణ లో MPTC, ZPTC ఎన్నికలపై నేడు క్లారిటీ!
కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన అమెజాన్, ప్లిఫ్ కార్ట్ సెకండ్ సేల్స్ వ్యాపారం చేసే సయ్యద్ మోహినుద్దీన్ వ్యాపారనిమిత్తం గోడౌన్ పరిశీలనకు ఈ నెల 10న తన వద్ద పని చేసే ముస్తఫాతో కలిసి అలీషాన్ హోటల్ సమీపానికి వచ్చారు. అదే సమయంలో కాలాపత్తర్ ప్రాంతానికే చెందిన అసద్, జహంగీర్లు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి బలవంతంగా మోహినుద్దీన్ను షాహిన్నగర్ సగాఫ్ కాలనీకి తీసుకెళ్ళారు. అక్కడ ఖుద్దూస్, ఇక్బాల్ అనే ఇద్దరు వచ్చి వారితో కలిసారు. ఈ మేరకు లక్ష రూపాయలు ఇవ్వాలని వారు వ్యాపారిని డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బులు లేవని వ్యాపారి అనడంతో అసద్ కత్తితో దాడి చేశాడు.
అతనితో పాటు మరికొందరు సైతం దాడి చేయగా మోయినుద్దీన్ గాయాలపాలయ్యాడు. దీంతో గాయాల బాధకు బిగ్గరగా కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. తర్వాత అక్కడి నుండి బాధితుడు ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళాడు. అనంతరం బాధితుడు బాలాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన పోలీసులు విచారణ జరిపి కిడ్నాప్, దోపిడీ యత్నం, హత్యాయత్నానికి పాల్పడిన మహ్మద్ అసద్ (32), మహ్మద్ జహంగీర్ (23), మహ్మద్ నవాజ్ (26), మహ్మద్ సయీద్ (19), మహ్మద్ అల్తాఫ్ (27), మహ్మద్ ఇక్బాల్ మోహినుద్దీన్ (42), ఖుద్దూస్ బస్ఈవీ (30) లను అదుపులోకి తీసుకొని మారణాయుధాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మహ్మద్ ఇమ్రాన్, సైఫ్ ఫైజల్ పరారీలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: