(HYD Crime) హైదరాబాద్లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం మూడు నెలలకే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మూసాపేట ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..చందన జ్యోతి అనే యువతికి యశ్వంత్తో మూడు నెలల క్రితమే వివాహం జరిగింది.
Read Also: Fire accident: మేడికొండూరులో విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

కేసు నమోదు
అయితే పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని (HYD Crime) పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: