📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Telugu News:Hyd Crime:మాజీ భార్య పన్నాగంతో భర్త కిడ్నాప్‌ – రూ.22 కోట్ల స్థల వివాదం

Author Icon By Pooja
Updated: November 5, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో(Hyd Crime) చోటుచేసుకున్న ఒక విస్మయపరిచే కిడ్నాప్‌ కేసును అంబర్‌పేట పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. రూ.22 కోట్ల విలువైన స్థల విక్రయం నేపథ్యంలో ఈ నేరం జరిగింది. కరీంనగర్‌కు చెందిన మంత్రి శ్యామ్‌ అనే వ్యక్తి, తన మొదటి భార్య మాధవిలత (51)తో కొన్నేళ్ల క్రితం విడిపోయాడు. తరువాత శ్యామ్‌ తన పేరును అలీగా మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట కుదురుగా జీవిస్తున్నారు.

read also: Hyd-Nacharam:చట్నీ మీద పడిందని సిగరెట్లతో వ్యక్తిని కాల్చిచంపిన కిరాతకులు

ఇదిలా ఉండగా, శ్యామ్‌ ఇటీవల బంజారాహిల్స్‌లోని 600 గజాల స్థలాన్ని విక్రయించి రూ.22 కోట్లు పొందాడు. ఈ సమాచారం తెలిసిన మొదటి భార్య మాధవిలత, ఆ డబ్బును సొంతం చేసుకోవాలని దుష్ప్రయత్నం చేసింది. ఇందుకోసం ఆమె రాంనగర్‌కు చెందిన కట్ట దుర్గాప్రసాద్‌ అలియాస్‌ సాయితో రూ.1.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని భర్తను కిడ్నాప్‌ చేసి హత్య చేయాలన్న ప్లాన్‌ వేసింది.

ఆమె సహచరులుగా విద్యానగర్‌కు(Hyd Crime) చెందిన కాటమోని పురుషోత్తం, పురానాపూల్‌కు చెందిన సందోలు నరేష్‌కుమార్‌, ఆగాపురకు చెందిన కోశకోలు పవన్‌కుమార్‌, మంఘల్‌హాట్‌ నివాసి నారాయణ రిషికేష్‌సింగ్‌, అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన పిల్లి వినయ్‌ తదితరులు ఉన్నారు. అక్టోబర్‌ 29న డీడీ కాలనీలో ఉన్న శ్యామ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. ఆ సమయంలో రెండో భార్య ఫాతిమా అతనికి ఫోన్‌ చేయగా, ఒక మహిళ ఫోన్‌ ఎత్తి “ఇది మౌలాలిలో దొరికింది” అని తెలిపింది. ఫాతిమా వెంటనే అక్కడికి వెళ్లి ఆ ఫోన్‌ తీసుకుని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్లు చెర్లపల్లి(Cherlapalli) వద్ద వదిలి వెళ్లిన కారును గుర్తించారు. ఆ తర్వాత వారు మరో వాహనంలో శ్యామ్‌ను విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంకు తరలించారు. కానీ మాధవిలతను విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు పిలవడంతో నేరస్తులు అయోమయానికి గురయ్యారు. ఈలోగా శ్యామ్‌ తన స్నేహితుడు రఘునాథ్‌రెడ్డికి కాల్‌ చేసి, “కిడ్నాపర్లు రూ.30 లక్షలు అడుగుతున్నారు” అని తెలిపాడు. అక్టోబర్‌ 31న శ్యామ్‌ బంజారాహిల్స్‌లోని ఒక బ్యాంకులో డబ్బు డ్రా చేసేందుకు వచ్చి తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించాడు. తదుపరి విచారణలో పోలీసులు మొత్తం కుట్రను ఛేదించి, ప్రధాన నిందితురాలు మాధవిలతతో పాటు పది మందిని అరెస్టు చేశారు. ఇంకా నలుగురు పారిపోయి ఉండగా, వారిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

CrimeInvestigation KidnapCase Latest News in Telugu TelanganaNews Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.