Telugu News: Hema Reddy: క్షణాల్లో మాంసం ముద్దలు, అస్థిపంజరాలుగా మారారు..

Read Time:  1 min
Hema Reddy
Hema Reddy
FONT SIZE
GET APP

కర్నూలు: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వి.కావేరి ట్రావెల్స్(.Kaveri Travels) బస్సు దుర్ఘటన అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ భయానక దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన హైమారెడ్డి(Hema Reddy) అనే ప్రయాణికుడు మీడియాతో పంచుకున్న వివరాలు హృదయ విదారకంగా ఉన్నాయి.

Read also : NHIDCL: 34 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

ప్రత్యక్ష సాక్షి హైమారెడ్డి వాంగ్మూలం

“నేను పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు(Kurnool) వద్ద భారీ ట్రాఫిక్ కనిపించింది. డ్రైవర్ బస్సు కాలిపోతోందంట అని చెప్పగానే, వెంటనే కారు దిగి అక్కడికి వెళ్లాను. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. కొందరు గాయాలతో, మరికొందరు ఏడుస్తూ కనిపించారు. నేను వెంటనే కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశాను. కానీ అప్పటికే బస్సు మొత్తమూ మంటల్లో కాలి బూడిద అయిపోయింది. లోపల ఉన్నవారి శరీరాలు అస్థిపంజరాల్లా మారిపోయాయి. ఆ దృశ్యం చూసి నా మనసు విరిగిపోయింది” అని హైమారెడ్డి భావోద్వేగంగా చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ధర్మవరం ప్రాంతానికి చెందిన హరీష్ అనే వ్యక్తి తన కారులో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. బస్సు కింద చిక్కుకున్న బైక్ కూడా కాలిపోయింది.

 Hema Reddy

పోలీసుల విచారణ, బాధితులు

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ, బస్సు గురువారం రాత్రి 10:30కి హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరిందని తెలిపారు. తెల్లవారుజామున 3:30 సమయంలో బైక్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని చెప్పారు. ప్రయాణికులు నిద్రలో ఉండటంతో బయటపడలేకపోయారు. ప్రమాదం తర్వాత పారిపోయిన డ్రైవర్, సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, సుబ్రహ్మణ్యం వంటి కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ భద్రతా ప్రమాణాలపై ఆందోళనను పెంచింది.

బస్సు ప్రమాదం ఎక్కడ జరిగింది?

కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగింది.

ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు?

30 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.