హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఓ శివాలయంలో దొరికిన రహస్య లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ లేఖలో పేర్కొన్న విషయాలు కేవలం ఊహలు కానవు, అసలు విషయమై పోలీసులు సీరియస్గా దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా పేరు రావడం కూడా ఈ కేసును మరింత సున్నితంగా మార్చింది.
ఆలయంలో లభించిన లేఖ.. పూజారి అప్రమత్తతతో బయటపడ్డ మిస్టరీ
హిస్సార్లోని రెడ్ స్క్వేర్ మార్కెట్ సమీపంలోని ఒక శివాలయంలో పూజారి సురేష్ ఉదయం ఆలయం తలుపులు తెరిచిన సమయంలో గోధుమ రంగులో కవరులో ఒక లేఖ కనిపించింది. ఆ లేఖలో దేశవ్యాప్తంగా 100 మందిని కిడ్నాప్ చేసి పాకిస్థాన్, దుబాయ్కి అక్రమ రవాణా చేసినట్లు ఉంది. హిస్సార్లోని రెడ్ స్క్వేర్ మార్కెట్లోని శివాలయం వద్ద ఆలయ పూజారి సురేశ్కు ఈ లెటర్ దొరికింది. ఆయన వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
లేఖలో ఉన్న పేర్లు.. నగరాల పేర్లు.. షాకింగ్ డిటైల్స్
లేఖలోని వివరాలు ప్రకారం హిస్సార్, అంబాలా, గురుగ్రామ్, సిర్సా, రేవారి, గంగానగర్, అజ్మీర్, నర్వానా సహా దేశంలోని వివిధ నగరాల నుంచి 80- 100 మందిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి దుబాయ్, పాకిస్థాన్కు విక్రయించినట్లు లేఖలో ఉంది. ఘటన తీవ్రతను గమనించిన పోలీసులు లేఖను సీనియర్ అధికారులకు అందించారు. వెంటనే ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
2018 నుంచే ఈ చౌకబారు ముఠా కార్యకలాపాలు?
లేఖ రాసిన వ్యక్తి తన పేరు గోప్యంగా ఉంచినప్పటికీ, ఆయన అందించిన వివరాలు భయంకరంగా ఉన్నాయి. తాము 2018 నుంచి ఈ అక్రమ రవాణా ప్రారంభించామని ఫతేహాబాద్కు చెందిన ఒక కుటుంబం తమకు సహాయం చేసేదని అందులో వెల్లడించాడు. వారు లక్ష్యాలను ఎంచుకుని ప్రేమ లేదా డబ్బు లావాదేవీల ద్వారా ప్రజలను వలలో వేసుకునేవారన్నాడు. హిస్సార్కు చెందిన సుమిత్ గార్గ్, అంబాలా వాసి దిగ్విజయ్, నర్వానాకు చెందిన నవీన్ రోహిలా, గురుగ్రామ్ వాసి అమర్నాథ్, ఎల్లనాబాద్కు చెందిన వినోద్ కుమార్, అమిత్ బాగ్రి, రేవారీకి చెందిన అన్షు గులాటి, గంగానగర్కు చెందిన రోహిణి, సన్నీ, అజ్మీర్కు చెందిన అంకిత్ శర్మ, సిర్సాకు చెందిన అనూజ్, యాజ్పుర్కు చెందిన నరేశ్ను వేరే దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు.
తెలంగాణ చిరునామా కలకలం – నిజామాబాద్ ఎలిమెంట్
ఆ లెటర్పై తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన ఆలకుంట సంపత్ చిరునామా ఉండటం కేసును మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఈ విషయంపై హర్యానా పోలీసులు ప్రత్యేకంగా తెలంగాణ పోలీసులతో సమన్వయం చేస్తూ విచారణ చేపట్టారు. ఈ చిరునామా నిజమేనా? ఆ వ్యక్తి పాత్ర ఏంటి అన్నదానిపై వివరణ కోసం పోలీసులు అడుగులు వేస్తున్నారు.
కేంద్ర సంస్థల జోక్యం – ఇంటెలిజెన్స్, RAW రంగంలోకి?
పాకిస్థాన్, దుబాయ్ వంటి ప్రదేశాలకు భారతీయుల అక్రమ రవాణా జరుగుతుందని ప్రస్తావించడం వల్ల దర్యాప్తు సంస్థలు ఈ లేఖను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టడానికి హరియాణా పోలీసులు కేంద్ర సంస్థలను సంప్రదించారు. అదే సమయంలో లేఖలో పేర్కొన్న వ్యక్తుల అదృశ్యాన్ని ధ్రువీకరించడానికి వారి కుటుంబాలను సంప్రదిస్తున్నారు.
ఫోరెన్సిక్ దర్యాప్తు.. నిజం బయటకు రావొచ్చా?
లేఖ కవర్పై పేరు ఉన్న వ్యక్తిని కనుగొనడానికి ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని హిస్సార్ పోలీసు సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అతి త్వరలో నిజం అందరికీ తెలుస్తుందన్నారు. పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజల్లో భయాందోళన – పోలీసులు అప్రమత్తం
మానవ అక్రమ రవాణా గురించి లెటర్ వైరల్ కావడం వల్ల హిస్సార్, దాని పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. స్థానికులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండి, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
ఇందులో ఒకరు పాకిస్థాన్ నుంచి పారిపోయారని కూడా లేఖలో వివరించాడు. పారిపోయిన యువకుడిని పట్టుకుని చంపమని లేదా అతని కుటుంబం నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయమని ఈ ముఠా నాయకురాలు బెదిరిస్తోందని అందుకే భయపడి ఈ లేఖ రాస్తున్నానని అందులో పేర్కొన్నాడు. ఈ లేఖలో హిస్సార్కు చెందిన సుమిత్ గార్గ్ గురించి ప్రస్తావించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిస్సార్ లో సుమిత్ అనే పేరు ఉన్న నాలుగైదు మంది కనిపించకుండాపోయినట్లు తేలింది. వారిలో ఎవరు అక్రమ రవాణాకు గురయ్యారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వారి కుటుంబాలను సంప్రదించారు. అలాగే అక్రమ రవాణాకు సాయం చేసిన ఫతేహాబాద్కు చెందిన కుటుంబం కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
Read also: Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి శిథిలాలపై ఆందోళన!