హర్యానా (Haryana) లోని ఫరీదాబాద్లో జరిగిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు కక్షతో కాల్పులు జరిపిన ఈ సంఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ చదువుకోవడానికి వెళ్లే ప్రైవేట్ లైబ్రరీ వెలుపల ఈ ఘటన జరిగింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
Read Also: TG Crime: అప్పుల ఒత్తిడి తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య
పోలీసుల కథనం ప్రకారం నిందితుడికి బాలిక దినచర్య, ఆమె లైబ్రరీకి వచ్చి వెళ్లే సమయాలు బాగా తెలుసు. పక్కా ప్రణాళికతోనే ఆమె రాక కోసం ముందుగానే అక్కడ కాపుకాశాడు. ఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ (CCTV footage) లో, బాలిక రాకముందే నిందితుడు అక్కడ వేచి ఉండటం కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఆమె కదలికలను నిరంతరం గమనిస్తూ ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నిందితుడిని గుర్తించింది. “ఆ అబ్బాయి నాకు తెలుసు. చాలా కాలంగా నన్ను వేధిస్తున్నాడు” అని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. గతంలో అతను వేధించడం వల్లే తాను అతడిని సులభంగా గుర్తుపట్టగలిగానని ఆమె తెలిపింది.
బాలికపై కాల్పులు జరిపిన తర్వాత నిందితుడు తన వద్ద ఉన్న ఆయుధాన్ని ఘటనా స్థలంలోనే పడేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసు ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: