హర్యానా (Haryana) లోని ఫరిదాబాద్ (Faridabad) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దాంపత్య జీవితంలో జరుగుతున్న మనస్పర్థలు ఒక కుటుంబాన్ని చెదరగొట్టాయి. భార్యతో తరచూ జరిగే గొడవలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, చివరకు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపడమే కాక, ఉద్యోగాలు చేసి స్థిరపడుతున్న యువ దంపతులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై సమాజమంతా ఆలోచించేలా చేసింది.
Read Also: Rabies: నిజామాబాద్లో కుక్క కాటు దాచిన బాలిక రేబిస్తో మృతి
ఫరిదాబాద్కు చెందిన యోగేష్ కుమార్ అనే వ్యక్తి, సుమారు తొమ్మిదేళ్ల క్రితం నేహా అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, మంచి జీవితం సాగించాలని భావించారు. వారి దాంపత్య జీవితం క్రమంగా ముందుకు సాగింది. వారికి ఒక ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది.
మాటామాటా పెరిగి గొడవలకు కారణమయ్యాయి
అయితే, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, పరస్పర అర్థం చేసుకో లేకపోవడం వంటివి వారి సంబంధంలో విభేదాలను పెంచాయి.ఇటీవల కుమార్తెను చూసుకోవడానికి యోగేష్ తన తల్లిని తమతో ఉండటానికి పిలిపించాడు.
ఈ విషయం నేహాకు, ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీని నేపథ్యంలో దంపతుల మధ్య మాటామాటా పెరిగి గొడవలకు కారణమయ్యాయి.తాజాగా మళ్లీ వాగ్వాదం జరిగి బిల్డింగ్ పైనుంచి అతడు దూకేశారు. నేహా సహా ఐదుగురిపై కేసు నమోదైంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: