పంజాబ్ (Punjab) లో ప్రసిద్ధ కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్ (Gurvinder Singh) ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) సభ్యులు కాల్చిచంపారు. పంజాబ్లోని మోగా జిల్లా పరిధిలో జరిగింది. ఈ ఘటన క్రీడా ప్రపంచాన్నే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. శత్రువులందరికీ ఇదే తమ హెచ్చరిక అని SM లో పోస్టు చేసింది.
Read Also: Amanjot Kaur: నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఖండించిన అమన్జోత్ కౌర్
‘మీ దారులు మార్చుకోండి లేదా గుండెలో బుల్లెట్ దించుకోవడానికి రెడీగా ఉండండి’ అని పేర్కొంది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు 2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్స్టర్స్, క్రైమ్తో సంబంధమున్న 10 మంది కబడ్డీ ప్లేయర్లు హత్యకు గురికావడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఇటీవల భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్సింగ్ సహాసిని కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ చంపినట్లు తెలిపింది. డబ్బులు ఇవ్వలేదని హత్య చేసినట్లు తెలిపింది. అలాగే కెనడాలోని పంజాబీ గాయకుడు చాని నట్టన్ ఇంటి వెలుపల జరిగిన కాల్పులు కూడా తామే జరిపినట్లు వెల్లడించింది. వరుసగా పంజాబ్లో ఇలాంటి హత్యా ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: