దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అత్యాచారం, హత్యకేసులో దోషిగా శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్కు Gurmeet Ram Rahim Singh) మరోసారి పెరోల్పై 40 రోజులు బయట గడపనున్నారు. 40రోజులు పెరోల్ రావడంతో నేడు ఆయన రోహతక్ లోని సునారియా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఊరేగింపుగా సిర్సా హెడాక్వార్టర్స్ కు బయలుదేరారు. 2020 తర్వాత గుర్మీత్సింగ్ తాత్కాలికంగా జైలు నుంచి విడుదల కావడం ఇది 14వసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్లోనూ ఆయన 21 రోజుల సెలవుపై విడుదలయ్యారు. గుర్మీత్సింగ్ ఇప్పటివరకు ఏకంగా 326 రోజులు జైలు బయట గడిపారు. గుర్మీత్ రామ్హీమ్ సింగ్ 2017లో తన శిష్యులిద్దరిపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదనంతగా 2019లో ఒక జర్నలిస్ట్ హత్య కేసు (Journalist murder case), 2021లో డేరే మేనేజర్ రంజిత్సింగ్ హత్యకు కుట్ర కేసులో ఆయన దోషిగా తేలారు.

అత్యాచార కేసు దోషికి మళ్లీ పెరోల్ – ఎన్నికల ముందు విడుదలపై తీవ్ర విమర్శలు
ఇద్దరు శిష్యులపై అత్యాచారం ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. మీడియా ఈ ఉదంతంపై అధికంగా కవర్ చేయడం వల్ల గుర్మీత్సింగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఆయన ఆశ్రమంలో అధికారులు సోదాలు (Officers search) నిర్వహించగా అతని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. తన మాట వినని వారు ఎవరైనా తిరిగి బయటకు వెళ్లలేరని, నిత్యం ఆశ్రమంలోని అమ్మాయిలతో లైంగిన సంబంధాలు కలిగి ఉన్నారనే పలు ఆరోపణలు ఆయనపై అప్పట్లో వచ్చాయి. విడుదలపై విమర్శలు కాగా గుర్మీత్సింగ్ తరచూగా పెరోల్పై విడుదలవుతుండటం పలు విమర్శలకు తావిస్తోంది. గత ఏడాది అక్టోబర్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు 20 రోజుల పెరోల్, ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 8 రోజుల ముందు 30రోజులు పెరోల్లో బయటే ఉన్నారు. ఈ పెరోల్ సమయంలో గుర్మీత్సింగ్ సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలో గడుపుతారు.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్పై ఏ కేసుల్లో శిక్ష పడింది?
ఆయనపై 2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారం, 2019లో జర్నలిస్ట్ హత్య, 2021లో డేరా మేనేజర్ హత్యకు కుట్ర కేసుల్లో శిక్ష పడింది.
గుర్మీత్ సింగ్ పెరోల్పై విడుదల కావడం ఎందుకు విమర్శలకు దారితీస్తోంది?
ఆయన్ని ఎన్నికల ముందు పెరోల్పై విడుదల చేయడాన్ని రాజకీయ ప్రేరణతో చూశారు కాబట్టి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: