📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: GHMC: పారిశుద్ధ్య కార్మికురాలి పై అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి

Author Icon By Anusha
Updated: November 1, 2025 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్ఎంసీ (GHMC) పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. ఎర్రగడ్డ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై చెత్తను ఊడుస్తూ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. నిందితుడు రాజు అనే వ్యక్తి మద్యం మత్తులో ఉండి, బాధితురాలిని బలవంతంగా లైంగిక దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నిన్న తెల్లవారుజామున జరిగినప్పటికీ ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read Also: Tirumala Laddu: వైవి చుట్టూనే కల్తీనెయ్యి కేసు!

ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ (GHMC) పారిశుద్ధ్య కార్మికురాలు విధులు నిర్వహిస్తుండగా అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీరోజు లాగే బాధితురాలు తన విధులను నిర్వహించేందుకు ఎర్రగడ్డకు వెళ్లింది.

GHMC

కేటాయించిన పని స్థలంలో విధులు నిర్వహిస్తుండగా

తనకు కేటాయించిన పని స్థలంలో విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఆమెను బలవంతం చేశాడు.ఎర్రగడ్డ(hyderabad-erragadda) ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై చెత్తను ఊడుస్తుండగా అక్కడే మాటేసిన రాజు అనే వ్యక్తి కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ దారుణ ఘటనపై బాధిత మహిళ బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి ఉన్న రాజు ఆ  మత్తులో పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మోడల్ కాలనీలో ఓ అపార్టెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా నిందితున్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

GHMC worker rape case Hyderabad crime latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.