మనం ఏ యుగంలో జీవిస్తున్నామో తెలియడం లేదు. నిస్సహాయస్థితిలో ఉన్న యువతిని కాపాడాల్సిన అంబులెన్స్(Ambulance) సిబ్బందే దారుణానికి ఒడిగట్టారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఒకటి బీహార్(Bihar) లో జరిగింది. ఈనెల 24వ తేదీన జరిగిన ఈ ఘటన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల యువతి బీహార్ లోని గయాలో జిల్లాలోని మిలిటరీ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరైంది. అధికారులు ఆమెకు ఫిజికల్ టెస్టు నిర్వహిస్తుండగా ఆ యువతి కళ్లుతిరిగి కిందపడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్సును ఏర్పాటు చేశారు. అప్పటికే స్పృహకోల్పోయిన ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
సామూహిక అత్యాచారం
మార్గమధ్యలో తనను పలువురు వ్యక్తులు పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను స్పృహ కోల్పోయి ఉండగా కదులుతున్న అంబులెను సలోనే తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. కేసు నమోదు చేసుకున్న బోదయా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ
ఫూటేజ్ ఆధారంగా వాళ్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు