📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Food Poisoning: మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

Author Icon By Tejaswini Y
Updated: March 13, 2026 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Food Poisoning: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత గ్రామంలోనే విద్యార్థుల ఆరోగ్యంతో సిబ్బంది చెలగాటం ఆడారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి భోజనం వికటించి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి చికెన్ తిన్న 390 మంది విద్యార్థులలో, కొందరికి భోజనం చేసిన కాసేపటికే వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి.

Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి

Food Poisoning: There is a commotion in the minister’s village.. 40 people in the Gurukulam got food poisoning!

సిబ్బంది గోప్యత.. పరిస్థితి విషమం

ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించడం గమనార్హం. విద్యార్థులకు వసతి గృహంలోనే ప్రాథమిక చికిత్స అందించి సరిపెట్టారు. అయితే, ఇద్దరి పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని సత్తుపల్లిలోని డేకేర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పాఠశాల వద్దకు వెళ్లగా, లోపలికి అనుమతించకుండా సిబ్బంది అడ్డుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

bhadradri kothagudem news food poisoning Food Poisoning in gurukulam schools Hostel Food Negligence Sattupalli Hospital Telangana Gurukulam News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.