పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి ఏడేళ్లు పూర్తికావడంతో జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా శ్రీనగర్తో పాటు పుల్వామా, అవంతిపురా, అనంతనాగ్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏవైనా అనూహ్య ఘటనలు జరగకుండా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
Read Also: Manipur violence : మణిపూర్లో మళ్లీ హింస, ఇళ్ల దహనం, కర్ఫ్యూ విధింపు
2019 ఫిబ్రవరి 14న(Feb 14) జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై పుల్వామా జిల్లా లేథిపూర–ఆవంతిపురా ప్రాంతంలో ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఉగ్రవాది కాన్వాయ్లోకి దూసుకెళ్లి ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది.
ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందగా, దాడికి పాల్పడిన ఉగ్రవాది కూడా మృతి చెందాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహాన్ని(Feb 14) కలిగించింది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. పుల్వామా దాడి భారత భద్రతా వ్యవస్థలో కీలక మలుపుగా మారింది. అనంతరం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు మరింత కఠినంగా అమలు చేయబడ్డాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు దేశం తరఫున నేడు నివాళులు అర్పిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: