Atrocious : తమిళనాడులో ముగ్గురు ఆడపిల్లల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య

Read Time:  1 min
Atrocious : తమిళనాడులో ముగ్గురు ఆడపిల్లల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య
FONT SIZE
GET APP

తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాసిపురం (Rasipuram) ప్రాంతంలో ఒక అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు సొంత కూతుళ్లను ఒక తండ్రి అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపిన అనంతరం తాను కూడా ఆత్మహత్య (suicide ) చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆర్థిక సమస్యలే కారణమా?

ఈ ఘాతుకానికి ఆర్థిక సమస్యలే కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. తండ్రి తీవ్రమైన అప్పుల భారంతో బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే ముగ్గురు కూతుళ్లను హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన జరగడానికి ముందు భార్యను, కొడుకును ఒక గదిలో బంధించి, ఈ దారుణానికి ఒడిగట్టాడు. బంధించిన గది నుంచి భార్య, కొడుకు బయటకు రాగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులతో పాటు, స్థానికులను కూడా విచారిస్తున్నారు. ఆర్థిక సమస్యలే ఈ దారుణానికి దారితీశాయా, లేక మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటన నామక్కల్ జిల్లా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read Also : Hyderabad Rains : హైదరాబాదులో దంచి కొట్టిన వర్షం

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.