Eluru crime: ఏలూరు జిల్లాలోని పెదవేగిలో ఉన్న గురుకుల పాఠశాలలో ఘోరం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఈపిచర్ల అజిత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Read Also:UP Bus Accident: బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

ఘటన వివరాలు
పాఠశాల సిబ్బంది కథనం ప్రకారం.. హాస్టల్(Gurukula School) గదిలో తోటి విద్యార్థులెవరూ లేని సమయంలో అజిత్ ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఉపాధ్యాయులు అజిత్ను ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు తెలిసింది.
కుటుంబ సభ్యుల అనుమానాలు
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బాధితుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే, అజిత్ మృతిపై అతని కుటుంబ సభ్యులు మరియు బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: