దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకూ కొత్త పద్ధతులతో అమాయకులను వలలోకి దింపుతున్నారు. తాజాగా వారు ప్రభుత్వ పెద్దల పేర్లు, సంతకాలను కూడా ఫోర్జరీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
ఇటీవల పుణెలో చోటుచేసుకున్న ఘటనలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో నకిలీ అరెస్ట్ వారెంట్(Digital Arrest) సృష్టించి, ఒక విశ్రాంత ఎల్ఐసీ మహిళా అధికారిణిని రూ.99 లక్షల మేర మోసం చేశారు.
Read Also: AP: భాగస్వామ్య సదస్సుకు విశాఖ రెడీ
ఎలా జరిగింది మోసం
పుణెలోని కోత్రుడ్ ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల మహిళకు అక్టోబర్ చివర్లో ఒక వ్యక్తి ఫోన్ చేసి, తాను “డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ” అధికారి అని పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పి భయపెట్టాడు.
తరువాత మరో వ్యక్తి, తాను సీనియర్ పోలీస్ అధికారి “జార్జ్ మాథ్యూ” అని చెబుతూ వీడియో కాల్ చేశాడు. మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యిందని, ఆమె బ్యాంకు ఖాతాలు సీజ్ చేయనున్నట్లు చెప్పాడు. అంతేకాదు, నిర్మలా సీతారామన్ నకిలీ సంతకం, ప్రభుత్వ ముద్రతో కూడిన అరెస్ట్ వారెంట్ను వాట్సాప్లో పంపించారు.
‘డిజిటల్ అరెస్ట్’ మాయ
మోసగాళ్లు బాధితురాలిని వాట్సాప్ కాల్లోనే ఉంచి, “డిజిటల్ అరెస్ట్”(Digital Arrest)లో ఉన్నట్లుగా నటించారు. ఆమె వద్ద ఉన్న నిధులను “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు” బదిలీ చేయమని ఆదేశించారు. భయంతో ఆమె రూ.99 లక్షలను పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. కొంతసేపటి తర్వాత కాల్ కట్ అయి, నంబర్లు స్విచ్ఛాఫ్ కావడంతో తాను మోసపోయానని గ్రహించి, వెంటనే పుణె సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, డబ్బు వెళ్లిన ఖాతాలను బ్లాక్ చేయడానికి చర్యలు ప్రారంభించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: