దేశంలోనే సంచలనం రేపుతోన్న కర్ణాటకలోని ధర్మస్థల కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. వందలాది మహిళలు, బాలికలను అత్యంత దారుణంగా లైంగికదాడులకు పాల్పడి ఆపై వారిని హతమార్చారు. చంపి, ఆపై రహస్యంగా వారిని సమాధి చేసేవారు. వాస్తవాలు సమాధి అయ్యాయని నిందితులు భావించారు.కానీ ఆ సమాధి నిజాలు వెలుగులోకి వచ్చేసరికి కర్ణాటక సర్కారు (Government of Karnataka) ఉక్కిరిబిక్కిరైపోతున్నది. ధర్మస్థల క్షేత్రంలో సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 10 ప్రాంతాల్లో తవ్వకాలు ముగిశాయి. పలు చోట్ల అస్థిపంజరాలు, ఎముకలు దొరికాయంటూ ప్రచారం జరుగుతోంది.
నేడు సిట్ అధికారులు 11,12వ ప్రాంతంలో
తవ్వకాలు ప్రారంభించారు. 11వ ప్రాంతంలో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.
దుస్తులు, చెప్పుల ఆనవాళ్లు లభ్యం,చెదలు పట్టిన దుస్తులు, చెప్పుల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలుస్తోంద. తవ్వకాల్లో బయటపడిన వాటి గురించి సిట్ అధికారులు (SIT officials) పూర్తిస్థాయిలో ధృవీకరించడంలేదు. అస్థిపంజరాల గుర్తింపు కోసం జిపిఆర్-గ్రౌండ్ పెనెట్రేటింగ్ తవ్వకాలు జరపాలంటే లేఖ రాశారు. 11ఏళ్లలో నేత్రావతి నది పరిసర ప్రాంతాలు, అటవీపూర్తిగా మారిపోయిందంటూ లేఖలో మెడికో తల్లి పేర్కొన్నారు.
రికార్డుల గల్లంతుపై అనుమానాలు
ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే, బెళ్తంగడి పోలీస్టేషన్లో 2000 నుండి 2015 మధ్యకాలంలో నమోదైన అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులుగల్లంతైనట్లు ఆర్టీఐ కార్యకర్త జయంత్ వెల్లడించారు. ఈ రికార్డుల గల్లంతు ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తుందని, సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈపని చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై జయంత్ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధ్యతతో కూడిన పదవుల్లో ఉంటూనేఅక్రమాలకుపాల్పడ్డవారిని చట్టం ఏ శిక్ష విధించినా తక్కువే అని బాధిత కుటుంబాలు అంటున్నాయి. ఎంతో భద్రంగా ఉంచాల్సిన రికార్డులు గల్లంటైనట్లు ఆర్టీఐ అనడంఎంతవరకు సమంజసం? ఈ కేసు ఆదినుంచి అనేక మలుపులు తిరుగుతున్నది. ఇందులో ఉన్న నిందితులకు బడా రాజకీయనాయకుల ప్రమేయం ఉందనేఆరోపణలకు బలం చేకూరుతున్నది.
ధర్మస్థల ఆలయ చరిత్ర వెనుక కథ ఏమిటి?
ధర్మస్థల ఆలయం చరిత్ర సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం జైన వంశం కాలంలో ప్రారంభమైంది. “ధర్మస్థల” అనే పేరే దాని ఉద్దేశాన్ని సూచిస్తుంది – “ధర్మ” అంటే నీతి, “స్థల” అంటే స్థలం.
ధర్మస్థల ఆలయంలో జరిగే అద్భుతాలు ఏమిటి?
ధర్మస్థల ఆలయంలో అత్యంత ప్రఖ్యాతి పొందిన అద్భుతం అన్నదానం సేవ. శతాబ్దాలుగా నిరంతరంగా జరుగుతున్న ఈ సేవలో ప్రతి రోజు వేలాది మంది భక్తులకు ఉచిత భోజనం అందిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: