📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Latest News: Delhi Crime: కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన ప్రేమోన్మాది

Author Icon By Anusha
Updated: October 27, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ తిరస్కరించిందని 20 ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన వాయవ్య ఢిల్లీ (Delhi) లోని అశోక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితురాలు కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమెపై ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: Vishal Singhal: కోట్ల ఇన్సూరెన్స్ మోసం..తల్లిదండ్రులు, భార్యను హత్య చేసిన కుమారుడు

ఘటన వివరాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. ఆదివారం ఉదయం స్పెషల్ క్లాస్ కోసం కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించారు. బాధితురాలు నివసించే ముకుంద్‌పూర్‌ (Mukundpur) కే చెందిన జితేందర్ అనే యువకుడు ప్రధాన నిందితుడని,

అతడితో పాటు ఇషాన్, అర్మాన్ ఈ దాడిలో పాల్గొన్నారని నార్త్‌వెస్ట్ డీసీపీ భీషమ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఇషాన్ ఇచ్చిన బాటిల్‌ను తీసుకున్న అర్మాన్ ఆమెపై యాసిడ్ పోశాడని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆమె తన ముఖాన్ని కాపాడుకునేందుకు చేతులు అడ్డుపెట్టడంతో, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

Delhi Crime

ఆసుపత్రికి తరలించారు

దాడి అనంతరం నిందితులు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని వెంటనే సమీపంలోని దీప్ చంద్ బంధు ఆసుపత్రి (Deep Chand Bandhu Hospital) కి తరలించారు.ప్రాథమిక విచారణలో జితేందర్ గత కొన్ని నెలలుగా యువతిని వెంబడిస్తూ వేధిస్తున్నట్లు తేలింది. సుమారు నెల రోజుల క్రితం ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ఆమె శరీరంలోని పలు భాగాల్లో కాలిన గాయాలయ్యాయని 

తన సోదరి పరిస్థితి విషమంగా ఉందని, ఆమె శరీరంలోని పలు భాగాల్లో కాలిన గాయాలయ్యాయని బాధితురాలి సోదరుడు మీడియాకు తెలిపారు. “మా ఇంటి దగ్గరే ఉండే నిందితుడు నా సోదరిని పదేపదే వేధిస్తున్నాడు. గత నెలలో ఆమె అతడిని నిలదీసింది. మాకు న్యాయం జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Acid attack Breaking News Delhi Crime latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.