ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద జరిగిన దాడి (Delhi Bomb Blast) ఘటనపై దర్యాప్తు సంస్థలు కీలక విషయాలను బయటపెట్టాయి. ఈ దాడి ఒక్కసారిగా జరిగినది కాదని, దీని వెనుక పెద్ద ఉగ్ర కుట్ర దాగి ఉందని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడి (Delhi Bomb Blast) వెనుక ఉగ్రవాద సంస్థల గట్టి ప్లాన్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Sandeep Chakravarty: మన తెలుగోడి ఘనత.. భారీ కుట్ర భగ్నం

దీపావళి రోజున కూడా భారీ బాంబు పేలుళ్లు జరపాలనే కుట్ర
జనవరి 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు, అలాగే దీపావళి రోజున కూడా భారీ బాంబు పేలుళ్లు జరపాలనే కుట్రకు సంబంధించిన ఆధారాలు దొరికాయని నిఘా సంస్థలు చెబుతున్నాయి.ఇందుకోసం ఉమర్ నబీ, ఉమర్ మహ్మద్ పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు సమాచారం. కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 9 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: