దేశ రాజధాని ఢిల్లీలోని(Delhi) ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన ఆత్మాహుతి దాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక అడుగులు వేసింది. ఈ కేసులో దాడికి (Delhi blast) పాల్పడిన టెర్రర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన హ్యుందాయ్ ఐ20 కారు యజమాని కశ్మీరీ వ్యక్తి అమీర్ రషీద్ అలీని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అలాగే, వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కు ఆర్థిక మరియు లాజిస్టికల్ సహాయం అందించిన డాక్టర్ ప్రియాంక శర్మను కూడా అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తు ప్రకారం అమీర్ రషీద్ అలీ దాడికి ఉపయోగించిన కారును ఉమర్కి సమకూర్చాడు. కారులో ఐఈడీ అమర్చిన ఉమర్ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఫోరెన్సిక్ పరీక్షల్లో మృతదేహం ఉమర్ ఉన్ నబీదేనని నిర్ధారణ అయ్యింది. ఎన్ఐఏ దాడి కోసం అమీర్ మరియు ఉమర్ కలసి కుట్ర పన్నినట్లు గుర్తించింది.
Read also: హైదరాబాద్ యాత్రికుల మృతి అత్యంత బాధాకరం: కేటీఆర్
TATP పేలుడు పదార్థం, సైనిక బుల్లెట్లు దర్యాప్తులో కొత్త కోణం
డాక్టర్ ప్రియాంక శర్మ, గతంలో అనంత్నాగ్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేసినవారు, ఉగ్ర మాడ్యూల్కి ఆర్థిక మరియు రవాణా సహాయం అందించినట్లు గుర్తించారు. దాడిలో TATP పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. TATP (ట్రియాసిటోన్ ట్రైపెరాక్సైడ్) అనేది అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రదాడుల్లో వాడే అత్యంత ప్రమాదకర పదార్థం. అదనంగా, పేలుడు చోటు నుండి మూడు 9ఎంఎం సైనిక బుల్లెట్లు లభించాయి, వీటిలో ఒకటి వాడబడిందని గుర్తించారు. ఈ ఆధారాలు కేసు దర్యాప్తులో కొత్త కోణాన్ని తెచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: